కొన్ని చోట్ల గాలి ద్వారానూ కరోనా!
కొన్ని చోట్ల కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ప్రచురితమైంది.
వెల్లడిస్తూ.. సూచనలు చేసిన ‘ది లాన్సెట్’ జర్నల్
వాషింగ్టన్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. అయినా దీన్ని నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ప్రచురితమైంది.
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19కు కారణమైన ‘సార్స్-కోవ్-2’ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న నివేదికలు ఆందోళనకు గురిచేశాయి. వీటిని నిర్ధారించేందుకు బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం నడుం బిగించింది. చివరకు గాలి ద్వారానూ వైరస్ వ్యాప్తి చెందుతుందని తేల్చే పది విషయాలను నివేదించింది.
సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు..
కరోనా వైరస్ వ్యాప్తికి ముఖ్యంగా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ సోకిన ఓ వ్యక్తి నుంచి 53 మందికి సోకిన ఓ ఘటనను నివేదికలో ఉదహరించారు. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం లేదా అతను తాకిన ప్రదేశాలు, వస్తువులను తాకకుండానే వారందరికీ వైరస్ సోకిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరిపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలిందని నిపుణులు స్పష్టంచేశారు. గాలిద్వారా వైరస్ వ్యాప్తి చెందడమే ఇలాంటి ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు.
లక్షణాలు లేని వారినుంచీ..!
బాహ్యప్రదేశాల్లో కంటే ఇండోర్ ప్రదేశాల్లోనే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇండోర్ ప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. అసింప్టమెటిక్(లక్షణాలు లేని)వ్యక్తుల నుంచి కరోనా వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతం దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేనివారి నుంచే ఇతరులకు సోకుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాపించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా వ్యవహరించిందని.. గాలిలో వైరస్ వ్యాపిస్తుందనడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపించిందని నిపుణులు వెల్లడించారు. ఒకరినొకరు సన్నిహితంగా మెలగకున్నా.. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకడాన్ని కూడా నిపుణులు ఉదహరించారు.
అయితే, తొందరగా ఉపరితలంపై పడిపోయే పెద్ద బిందువుల నుంచి వైరస్ తేలికగా గాలిలో ఎలా ప్రసరిస్తుందని శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో రుజువు చేయలేకపోయారు. అయినప్పటికీ డైనమిక్స్ ఆఫ్ ఫ్లుయిడ్ ఫ్లోస్, బ్రతికున్న వైరస్ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాల నివేదికలను పూర్తిగా విశ్లేషించామని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణడు గ్రీన్హాల్గ్ పేర్కొన్నారు. వీటిలో కొన్ని గాలిలో వ్యాప్తిని బలహీనమైనవిగా అంచనా వేసినప్పటికీ.. ఇది సాధ్యమనడానికి బలమైన ఆధారాలెన్నో ఉన్నాయని స్పష్టంచేశారు.
అప్రమత్తం కావాల్సిందే..
గాలిలో వైరస్ వ్యాపించడం తీవ్రమైనదని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేసింది. వైరస్ సోకిన వ్యక్తి శ్వాస (ఉచ్ఛ్వాసము) వల్ల వైరస్ గాలిలోకి వెళ్లడం.. తద్వారా ఇతరులు ఆ గాలి పీల్చినప్పుడు వైరస్ వారికి సోకుతుంది. ఇదే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లోనూ రుజువైందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఏరోసల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కింబర్లీ ప్రాథర్ స్పష్టం చేశారు. గాలి ద్వారానూ కరోనా వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ దిగువ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పరిశోధకులు పేర్కొన్నారు.
* గాలిలో వైరస్ వ్యాప్తి చెందకుండా సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.
* ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా చూసుకోవాలి.
* ఇండోర్ ప్రాంతాల్లో తక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి.
* ఇండోర్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలి.
* సాధారణ సమయాల్లోనూ నాణ్యమైన మాస్కులు వాడాలి.
* కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరించాలి.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య విభాగాలు నూతన మార్గదర్శకాల ద్వారా వైరస్ కట్టడికి అత్యవసర చర్యలు తీసుకోవాలని అధ్యయన బృందం సూచించింది. ఇక, గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఇదివరకే వెల్లడించింది. వీటిపై భారత్లో పరిశోధన చేస్తోన్న సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) కూడా ఇండోర్ ప్రాంతాల్లో గాలిలో వైరస్ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా