Corona: బ్రెజిల్ పిల్లల్లో అన్ని మరణాలెందుకు..?
కరోనా విషయంలో చిన్నారుల గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బ్రెజిల్ అనుభవాలు వెల్లడిస్తున్నాయి. అక్కడి పిల్లల్లో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలుస్తోంది
బ్రెసిలియా: మనదేశంలో కరోనా వైరస్ మొదటి దశలో చిన్నారులపై పెద్దగా ప్రభావం లేదు. రెండోదశలో కొద్దిమేర దాని తీవ్రత కనిపించింది. మూడోదశలో దాని ముప్పు తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా విషయంలో చిన్నారుల గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బ్రెజిల్ అనుభవాలు వెల్లడిస్తున్నాయి. అక్కడి పిల్లల్లో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ‘వైటల్ స్ట్రాటజీస్’ అనే ఎన్జీఓ దీనిపై అధ్యయనం చేసింది.
ఇప్పటివరకు సుమారు 4,67,000 మంది బ్రెజిల్ దేశీయులు కరోనావైరస్తో ప్రాణాలు కోల్పోయారు. అందులో 10 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 0.5 శాతం, అంటే 2,200 కంటే ఎక్కువే చనిపోయారు. ఐదేళ్ల లోపువాళ్లలో 900కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇదే సమయంలో కరోనా మరణాల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 6 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. అందులో 113 మరణాలు ఐదేళ్లలోపు చిన్నారులవి. ఈ లెక్కన చూసుకుంటే కరోనా కారణంగా బ్రెజిల్లోని చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు విడిచారు. బ్రెజిల్లో అధిక జనాభా ఉన్న సావ్ పాలో నగరంలో వైటల్ స్ట్రాటజీస్ ఈ అధ్యయనం నిర్వహించింది. 2020 చివరి నుంచి కౌమార వయస్కులు, చిన్నారుల్లో నమోదవుతున్న కేసులు పెరగడంతో పాటు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా ఎక్కువైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఐదేళ్లలోపువారితో సహా శిశువులు కూడా ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది.
ప్రారంభ రోజుల్లో పెద్దలతో పోల్చుకుంటే చిన్నారుల్లో వైరస్ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే బ్రెజిల్ పిల్లల్లో చోటుచేసుకున్న మరణాలతో పరిశోధకులు దీనికి కారణాలను అన్వేషిస్తున్నారు. రానున్న రోజుల్లో వైరస్ తీరుతెన్నులు ఏవిధంగా ఉండొచ్చనే అంశాలను పరిశీలిస్తున్నారు. బ్రెజిల్లో మొదట గుర్తించిన కరోనా రకం పీ.1(గామా) సంక్రమణ అక్కడ వేగంగా ఉంది. అది యాంటీబాడీలను పాక్షికంగా తప్పించుకొని వ్యాప్తి చెందగలదని తెలుస్తోంది. ఈ తరహా వైరస్ మ్యుటేషన్లే పిల్లల్లో తీవ్రతకు కారణంగా భావిస్తున్నారు. అమెరికాలో కూడా ఈ గామా వేరియంట్ ఉనికి చాటుతోంది. అక్కడ మొత్తం కేసుల్లో ఏడు శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని అంచనా. ఇది చిన్నారులు, శిశువులపై ప్రభావం చూపుతుందేమోనని భావిస్తున్నారు. అలాగే అక్కడ మూడింట రెండు వంతుల కేసులకు ఆల్ఫా వేరియంట్ కారణమని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు గామా ఉద్ధృతి కూడా తీవ్ర స్థాయిలో ఉందన్నారు. దాంతో టీకాల పనితీరు కీలకంగా మారనుంది. బూస్టర్ డోసులు, చిన్నారులకు టీకాల ఆమోదం వంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. అలాగే పిల్లల్లో కొవిడ్ ముప్పుపై వైద్య సిబ్బందికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. బ్రెజిల్లో కొవిడ్ సంక్షోభానికి కారణం కట్టడి చర్యల్లో వైఫల్యం, టీకా సరఫరా సరిగా లేకపోవడమేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్లు పుట్టుకొని వస్తుండటంతో బ్రెజిల్తో సహా, భారత్, కాంగో వంటి దేశాల్లో కరోనా కల్లోలం బయటపడుతోంది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సమాజం సమయానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే చిన్నారులు ఎలా ఇబ్బంది పడతారో బ్రెజిల్ అనుభవం తెలియజేస్తోందని చెబుతున్నారు.
మరోవైపు, బ్రెజిల్లో 2007, 2008 మధ్యలో చిన్నారులను డెంగీ ఇబ్బంది పెట్టింది. మొత్తం మరణాల్లో సగం కంటే ఎక్కువ పసిపిల్లలవే. అలాగే 2015లో జికా వైరస్ వెలుగుచూసింది. ఆ సమయంలో దాని బారిన పడిన గర్భిణులు.. మైక్రోసెఫాలీ వంటి జనన లోపాలతో ఉన్న బిడ్డలకు జన్మనిచ్చారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఇతర పరాన్న జీవులు అక్కడి పిల్లల్లో ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయి. ఇది ఆ దేశంలోని పేద గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!