US drone strike: అమెరికా చివరి దాడి గురి తప్పిందిలా..!
అఫ్గాన్లో అమెరికా వైఫల్యాల పరంపర చివరి వరకు కొనసాగింది. కాబుల్ను వీడటానికి కొద్ది రోజుల ముందు విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు అ
చివరి క్షణాల్లో హెచ్చరించిన సీఐఏ
అఫ్గాన్లో అమెరికా వైఫల్యాల పరంపర చివరి వరకు కొనసాగింది. కాబుల్ను వీడటానికి కొద్ది రోజుల ముందు విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు అగ్రరాజ్యాన్ని తీవ్ర గందరగోళంలో పడేసింది. దీంతో చివర్లో రెండుసార్లు డ్రోన్దాడులు నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తొలుత ప్రకటించింది. కానీ, అఫ్గాన్ గడ్డపై అమెరికా చేసిన చిట్టచివరి దాడిలో అమాయకులైన 10 మంది చనిపోయారు. ఈ విషయాన్ని అమెరికా సైనిక జనరల్స్ తొలుత అంగీకరించలేదు. కానీ, చివరకు అక్కడి పత్రికలు ఆధారాలతో బయటపెట్టాయి. అయిన కొన్నాళ్లు బుకాయించాక చివరికి అమెరికా సెంట్ కామ్ కమాండర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
చనిపోయింది ఎవరు..?
కాబుల్ డ్రోన్ దాడిలో చనిపోయిన వ్యక్తిపేరు జమారీ అహ్మదీ. అతను 2006 నుంచి కాలిఫోర్నియాకు చెందిన యుఎస్ ఎయిడ్ గ్రూప్లో ఎలక్ట్రికల్ ఇంజినీరగా పనిచేస్తున్నారు. దాడి జరిగిన రోజు ఉదయం ల్యాప్టాప్ తీసుకోవడానికి ఆఫీస్కు రావాలని అతనికి బాస్ నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇంటి నుంచి బయల్దేరి వెళ్లే సమయంలో మరో ఇద్దరిని ఎక్కించుకొన్నారు. మరికొద్ది సేపటికి తన బాస్ ఇంటి సమీపంలోకి వెళ్లారు. తన విధుల్లో భాగంగా స్థానిక తాలిబన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి శరణార్థులకు భోజనాలు ఇచ్చేందుకు అనుమతులు తీసుకొన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ఆఫీస్కు చేరుకొన్నారు. అనంతరం అక్కడే ఉన్న ఓ గార్డు సాయంతో ఇంటికి తీసుకెళ్లేందుకు కొన్ని క్యాన్లలో నీటిని నింపుకొన్నాడు. ఆ క్యాన్లను కార్లోకి ఎక్కించే సమయంలో డ్రోన్ను పర్యవేక్షించే వ్యక్తులు వాటిని పేలుడు పదార్థాలుగా భ్రమించారు. ఆ తర్వాత ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో వారిని దించేసి విమానాశ్రయానికి సమీపంలోని ఇంటికి వచ్చాడు. అప్పటికి సాయంత్రం 4.50 అవుతుంది. చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా.. డ్రోన్ ఆపరేటర్కు వాహనంలో ఒకే వ్యక్తి కనిపించాడు. దీంతో టాక్టికల్ కమాండర్ ఆదేశాలతో హెల్ఫైర్ క్షిపణిని ప్రయోగించారు. వాస్తవానికి అహ్మదీ రాగానే ఇంట్లోని చిన్నపిల్లలు సంతోషంతో ఆ కారును చుట్టుమట్టారు. అదే సమయంలో క్షిపణి తాకింది.
సీఐఏ హెచ్చరించే సమయానికి చేదాటిపోయింది..
అహ్మదీ ప్రయాణించిన ప్రాంతాల్లో ఒక చోట నుంచి తెలుపు రంగు టయోటా కరోలా వాహనంపై నుంచి కాబుల్ ఎయిర్పోర్టు పైకి రాకెట్లతో దాడి జరిగింది. అహ్మదీ వాహనం కూడా తెలుపు రంగు టయోటా కరోలా కావడంతో డ్రోన్ నిఘా పరిధిలోకి వచ్చాడు. అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రేపర్ డ్రోన్ కొన్ని గంటలపాటు అహ్మదీ కారుపై నిఘా ఉంచింది.
దాడి చేయడానికి చివరి నిమిషంలో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) హెచ్చరికలు జారీ చేసింది. లక్ష్యానికి సమీపంలో ప్రజలు, పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. కానీ, అప్పటికే బాగా ఆలస్యం జరిగింది. హెల్ఫైర్ క్షిపణి వాహనాన్ని తునాతునకలు చేసింది. మొత్తం 10 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మూడేళ్ల చిన్నారి అయిమల్ అహ్మదీ కూడా ఉంది.
మొండిగా సమర్థించుకొని.. ఆపై మాట మార్చి..!
ఈ దాడిపై పలు విమర్శలు వెల్లవెత్తాయి. పెంటగాన్ తన చర్యను మొండిగా సమర్థించుకొంది. కానీ, దర్యాప్తు జరిగాక అమెరికా సెంట్ కామ్(సెంట్రల్ కమాండ్) కమాండర్ జనరల్ మెకంజీ మాట్లాడుతూ నాడు డ్రోన్ దాడిలో చనిపోయిన వారికి ఐసిస్-కె సంబంధాలు లేవని తెలిపారు. బాధిత కుటుంబానికి అమెరికా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ దారుణానికి తనదే పూర్తి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ‘‘టయోటా తెలుపు రంగు కరోలా కారుపై మాకు వచ్చిన సమాచారం తప్పు’’ అని పేర్కొన్నారు.
దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలి..
అహ్మదీ కుటుంబ సభ్యులు ఈ దాడితో కుదేలైపోయారు. తమ పై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కుటుంబ సభ్యులు మరణించిన ఇంట్లో తాము ఉండలేకపోతున్నట్లు వాపోయారు. వీలైతే అఫ్గానిస్థాన్ నుంచి బయటకు తరలించాలని కోరారు. దాడికి కారణమైన అమెరికా సైనిక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అహ్మదీ సోదరుడు కోరాడు. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.