అరుణాచల్ సరిహద్దులకు చైనా బుల్లెట్ రైలు
వచ్చే జులై నాటికి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలోని టిబెట్ వరకు బుల్లెట్ రైలు నడిపేందుకు చైనా కార్యాచరణ ముమ్మరం చేసింది. చైనాలోని ల్లాసా నగరాన్ని, తూర్పు టిబెల్లోని నింగ్చి నగరాన్ని కలుపుతూ 435 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్....
బీజింగ్: వచ్చే జులై నాటికి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలోని టిబెట్ వరకు బుల్లెట్ రైలు నడిపేందుకు చైనా కార్యాచరణ ముమ్మరం చేసింది. చైనాలోని ల్లాసా నగరాన్ని, తూర్పు టిబెట్లోని నింగ్చి నగరాన్ని కలుపుతూ 435 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణం సాగుతోంది. 2014 నుంచి ఈ పనులు కొనసాగుతుండగా, వచ్చే జూన్ చివరి నాటికి ఆ మార్గంలో బుల్లెట్ రైలు దూసుకుపోనున్నట్లు చైనా రైల్వే అధికారులు వెల్లడించారు. టిబెట్లో విద్యుదీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్ కూడా ఇదే కానుంది. 2020 చివరి నాటికే ట్రాక్ పనులు పూర్తయ్యాయి. ఈ రైలును 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు. ప్రస్తుతం చైనాలో 37,900 కిలోమీటర్ల మేర హైస్పీడు రైళ్లు నడుస్తుండగా 2025 నాటికి 50 వేల కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్