India-China: సీడీఎస్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం!
భారత్కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాసం లోపించిందని కొన్ని రోజుల కిందట డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అకారణంగా చైనాను నిందిస్తున్నారని, ఈ వ్యాఖ్యలు
బీజింగ్: భారత్కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాసం లోపించిందని కొన్ని రోజుల కిందట డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అకారణంగా చైనాను నిందిస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని చైనా రక్షణ శాఖ ఆరోపించింది. ‘ఇరు దేశాలు ఒకదానికొకటి ముప్పుగా మారకూడదు. ఇలాంటి వ్యాఖ్యలతో ఘర్షణను ప్రేరేపించడం బాధ్యతారాహిత్యం, ప్రమాదకరం’’అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ వూ క్వియాన్ అన్నారు. బిపిన్ వ్యాఖ్యలపై తమ అభ్యంతరాన్ని ఇప్పటికే భారత ప్రతినిధులకు తెలియజేసినట్లు చెప్పారు.
‘‘చైనా-భారత సరిహద్దు సమస్యపై చైనాకు స్పష్టమైన వైఖరి ఉంది. చైనా సరిహద్దు భద్రతాదళాలు జాతీయ సార్వభౌమాధికారాన్ని, భద్రతను పరిరక్షిస్తున్నాయి. అలాగే, సరిహద్దు ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాయి. ఘర్షణ పరిస్థితిని తగ్గించడం కోసం గొప్ప ప్రయత్నాలు చేస్తున్నాయి’’అని సీనియర్ కల్నల్ వూ క్వియాన్ తెలిపారు.
గతేడాది తూర్పు లద్దాఖ్లో గల్వాన్ ఘటన అనంతరం భారత్-చైనా సరిహద్దుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాలు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు భారీ సంఖ్యలో సైనికులను మోహరించాయి. ఈ వివాదం పరిష్కారానికి ఇరు దేశాలకు చెందిన సైనికాధికారులు పలుమార్లు సమావేశమైనా చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!