China - US: ఏదో ఒకరోజు అమెరికాపై చైనా అణుదాడి..!
అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్రం, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలపై ఇరు దేశాలు చాలా సార్లు బహిరంగంగానే మాటల
హెచ్చరించిన అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం, దక్షిణ చైనా సముద్రం, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలపై ఇరు దేశాలు చాలా సార్లు బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగాయి. అంతేనా.. అత్యవసర పరిస్థితుల్లో అమెరికాను ఎదుర్కొనేందుకు డ్రాగన్ తన అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కొన్ని నెలల కిందట ఓ రహస్య క్షిపణి ప్రయోగాన్ని కూడా చేపట్టింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అమెరికాపై చైనా దాడికి సిద్ధమవుతుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా అగ్రరాజ్య మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు అమెరికాపై డ్రాగన్ అనూహ్య అణు దాడి జరపొచ్చని హెచ్చరించారు.
ఈ ఏడాది జులైలో చైనా అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అది.. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ పుడమి మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఇది కొద్దిలో గురితప్పినా.. ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో డ్రాగన్ చాలా వరకూ పట్టు సాధించినట్లు తేటతెల్లమైంది. అయితే అత్యంత గోప్యంగా జరిపిన ఈ ప్రయోగం ఇటీవల బయటపడింది. దీనిపై అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వైస్ ఛైర్మన్ జనరల్ జానీ హేటెన్ మరిన్ని వివరాలను సేకరించారు.
‘‘గత ఐదేళ్లలో చైనా వందలాది హైపర్సోనిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అమెరికా మాత్రం కేవలం 9 ప్రయోగాలే చేపట్టింది. ఇప్పటికే చైనా వద్ద మీడియం రేంజ్ హైపర్సోనిక్ ఆయుధం ఉంది. జులైలో ప్రయోగించిన క్షిపణి లాంగ్ రేంజ్ మిసైల్. వందలాది క్షిపణులను తయారు చేసుకుంటున్న చైనా.. ఏదో ఒక రోజు అమెరికాపై అనూహ్య అణ్వాయుధ దాడి జరిపే అవకాశం ఉంది’’ అని హేటెన్ హెచ్చరించారు. ఇటీవల పెంటగాన్ కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. డ్రాగన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శరవేగంగా పెంచుకుంటోందని, ఈ దశాబ్దం చివరి నాటికి ఆ దేశం వద్ద 1000 న్లూక్లియర్ వార్హెడ్లు ఉండొచ్చని అంచనా వేసింది.
ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6,200 కిలోమీటర్లు)గా దూసుకెళ్లే అస్త్రాలను హైపర్సోనిక్ క్షిపణులుగా పేర్కొంటారు. ఇలాంటి క్షిపణినే చైనా ఇటీవల ప్రయోగించింది. భూమి చుట్టూ ఓ క్షిపణి ప్రయాణించడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించిన చైనా.. అది క్షిపణి కాదని, వ్యోమనౌక అని వెల్లడించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM