ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత.. వాటిని వదిలేయొద్దు
పొరుగు దేశం నేపాల్లోనూ కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కూడా ఆక్సిజన్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సమకూర్చేందుకు ఉన్న అన్ని టఅక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే వారు తమ వెంట తీసుకెళ్లే ఆక్సిజన్ ట్యాంక్లను...
సాహసయాత్రికులను కోరిన నేపాల్ అధికారులు
ఖాట్మండు : పొరుగు దేశం నేపాల్లోనూ కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కూడా ఆక్సిజన్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సమకూర్చడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే వారు తమ వెంట తీసుకెళ్లే ఆక్సిజన్ ట్యాంక్లను అక్కడే వదిలేసి రాకుండా వాటిని వెంటపెట్టుకుని తీసుకురావాలని కోరింది.
ఎవరెస్ట్ సాహసయాత్రకు వెళ్లే వారు వీటిని అక్కడే వదిలి వేయక తమ వెంట తీసుకురావాలని నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్(ఎన్ఎంఏ) అధికారులు కోరారు. ‘ఈ సీజన్లో క్లైంబర్స్, వారి సహాయకులు దాదాపు 3500 ఆక్సిజన్ బాటిళ్లను తీసుకువెళ్లి ఉంటారని అంచనా. సాహస యాత్ర పూర్తికాగానే సాధారణంగా వీటిని పర్వతాల్లోనే వదిలేస్తుంటారు. అయితే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో అవి కరోనా బాధితులకు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే మేం సాహసయాత్రికులకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎన్ఎంఏ సీనియర్ అధికారి కాల్బహదూర్ తెలిపారు.
ఆదివారం నేపాల్లో దాదాపు 9 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెలలో నమోదైన రోజువారీ కేసుల కంటే ఈ సంఖ్య 30 రెట్ల అధికం. నేపాల్లో ఇప్పటి వరకూ 3.9 లక్షల కేసులు నమోదు కాగా..3,720 మరణాలు చోటుచేసుకున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఆక్సిజన్ కొరత కారణంగా ఎక్కువ మందిని చేర్చుకోలేకపోతున్నామని ఖాట్మండులోని ప్రైవేట్ ఆస్పత్రులు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్