ఎవరెస్ట్‌ ఎక్కిన తర్వాత.. వాటిని వదిలేయొద్దు

 పొరుగు దేశం నేపాల్‌లోనూ కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కూడా ఆక్సిజన్‌ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సమకూర్చేందుకు ఉన్న అన్ని టఅక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించే వారు తమ వెంట తీసుకెళ్లే ఆక్సిజన్‌ ట్యాంక్‌లను...

Published : 11 May 2021 01:10 IST

సాహసయాత్రికులను కోరిన నేపాల్‌ అధికారులు

ఖాట్మండు : పొరుగు దేశం నేపాల్‌లోనూ కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కూడా ఆక్సిజన్‌ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ సమకూర్చడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించే వారు తమ వెంట తీసుకెళ్లే ఆక్సిజన్‌ ట్యాంక్‌లను అక్కడే వదిలేసి రాకుండా వాటిని వెంటపెట్టుకుని తీసుకురావాలని కోరింది.

ఎవరెస్ట్‌ సాహసయాత్రకు వెళ్లే వారు వీటిని అక్కడే వదిలి వేయక తమ వెంట తీసుకురావాలని నేపాల్‌ మౌంటెనీరింగ్‌ అసోసియేషన్‌(ఎన్‌ఎంఏ) అధికారులు కోరారు. ‘ఈ సీజన్‌లో క్లైంబర్స్‌, వారి సహాయకులు దాదాపు 3500 ఆక్సిజన్‌ బాటిళ్లను తీసుకువెళ్లి ఉంటారని అంచనా. సాహస యాత్ర పూర్తికాగానే సాధారణంగా వీటిని పర్వతాల్లోనే వదిలేస్తుంటారు. అయితే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో అవి కరోనా బాధితులకు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే మేం సాహసయాత్రికులకు  ఈ విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎన్‌ఎంఏ సీనియర్‌ అధికారి కాల్‌బహదూర్‌ తెలిపారు.

ఆదివారం నేపాల్‌లో దాదాపు 9 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెలలో నమోదైన రోజువారీ కేసుల కంటే ఈ సంఖ్య 30 రెట్ల అధికం. నేపాల్‌లో ఇప్పటి వరకూ 3.9 లక్షల కేసులు నమోదు కాగా..3,720 మరణాలు చోటుచేసుకున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎక్కువ మందిని చేర్చుకోలేకపోతున్నామని ఖాట్మండులోని ప్రైవేట్‌ ఆస్పత్రులు పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని