లండన్ను దాటిన బెంగళూరు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ నగరంగా భారత టెక్నాలజీ రాజధాని బెంగళూరు అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో లండన్, మ్యూనిక్, బెర్లిన్, పారిస్ ఉన్నాయి.
టెక్నాలజీ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం
బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ నగరంగా భారత టెక్నాలజీ రాజధాని బెంగళూరు అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో లండన్, మ్యూనిక్, బెర్లిన్, పారిస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆరో స్థానంలో భారత్ ఆర్థిక రాజధాని ముంబయి నిలిచింది. లండన్& పార్టనర్స్ అనే అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడుల సంస్థ డీల్రూం.కాం డాటాను విశ్లేషించింది. ఈ వివరాల ప్రకారం 2016 నుంచి 2020 వరకూ బెంగళూరులో పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగిందన్నారు. ముంబయిలో పెట్టుబడులు 1.7 రెట్లు పెరిగాయని తెలిపారు. లండన్లో పెట్టుబడులు 3రెట్లు పెరిగినట్లు తెలిపారు. ‘‘బెంగళూరు, లండన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి రెండు టెక్ హబ్లుగా నిలిచాయి. టెక్ ఇన్వెస్లర్లకు ఈ రెండు ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు అనువైన అవకాశాలున్నాయి.’’ అని లండన్ & పార్ట్నర్స్ భారత ప్రతినిధి హెమిన్ భారుచా అన్నారు. లండన్కు భారత్తో బలమైన వాణిజ్య సంబంధాలున్నాయన్నారు. నివేదికలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా గొప్ప టెక్నాలజీలను సృష్టించడం ఈ రెండు నగరాలకే చెందిందన్నారు. లండన్లో ఇకపై భారత్కు చెందిన పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారని ఆకాంక్షిస్తున్నాం అని అన్నారు.
వెంచర్ కాపిటలిస్ట్లో ఆరో స్థానం..
ప్రపంచ టెక్ వెంచర్ కాపిటలిస్ట్ పెట్టుబడుల్లో బెంగళూరు ఆరోస్థానాన్ని పొందింది. దీనిలో బీజింగ్ మొదటి స్థానంలో నిలవగా శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ తరువాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా సంక్షోభంతో రిమోట్ వర్కింగ్ పెరగడంతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ వెంచర్ కాపిటలిస్టులకు మొదటి ప్రాధాన్యంగా మారింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం