ప్రణబ్.. భారత రత్న బంధం..!
‘‘గతేడాది ఆగస్టు 8.. నా తండ్రికి భారత రత్న లభించింది.. అది నాకు చాలా సంతోషకరమైన రోజు.. ఈ ఏడాది ఆగస్టు 10న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’.. ..
అవార్డుల పునరుద్ధరణలో కీలక పాత్ర
‘‘గతేడాది ఆగస్టు 8.. నా తండ్రికి భారత రత్న లభించింది.. అది నాకు చాలా సంతోషకరమైన రోజు.. ఈ ఏడాది ఆగస్టు 10న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’.. ఇది ప్రణబ్ ముఖర్జీ సైనిక ఆసుపత్రిలో చేరిన రోజు ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ చేసిన ట్వీట్..!. భారత రత్న అవార్డులకు ప్రణబ్కు మధ్య ఓ ఆసక్తికరమైన సంబంధం ఉంది.
ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనతా ప్రభుత్వం తరఫున అధికారం చేపట్టిన మొరార్జీ దేశాయ్ పౌర పురస్కారాలు ఆపేశారు. అప్పటికే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తనకు తానే భారత రత్న ప్రకటించుకొని విమర్శల పాలయ్యారు. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ భారత్ రత్న అవార్డులను తిరిగి ప్రారంభించాలని భావించారు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ప్రణబ్ ముఖర్జీ ఒకరు. ఆయన అప్పట్లో రాజ్యసభలో ఉన్నారు. ఒక రోజు ఇందిర రాజ్యసభలో ప్రణబ్ పక్కన కూర్చొన్నారు. పౌరపురస్కారాలను పునఃప్రారంభించాలని.. భారత రత్నకు ఒకరిని ఎంపిక చేయాలని కోరారు.
వివాదరహిత వ్యక్తులకు ఇవ్వడం ద్వారా దీనిని పునఃప్రారంభించాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష విమర్శలకు అస్సలు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే అవార్డుకు తగిన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నరావడంతో.. ప్రణబ్ ఆలోచించి మదర్థెరిస్సా పేరు సూచించారు. ఆ పేరు విని ఇందిరాగాంధీ చాలా సంతోషించారు. ఆమె జాతీయతపై ఇందిరాకు సందేహం రావడంతో.. ‘మదర్’ భారత పౌరసత్వం తీసుకొన్న విషయాన్ని ప్రణబ్ మరోసారి రూఢీ చేసుకొన్నారు. 1980 సంవత్సరానికి భారత రత్నగా మదర్ పేరును ప్రకటించారు. దీంతో ఎవరూ ఇందిరా గాంధీని విమర్శించే అవకాశం రాలేదు.
రాజకీయ చాణక్యం..
భారత్ రత్న అవార్డు ఒక్కటే ప్రధాని సలహాతో రాష్ట్రపతి ప్రకటిస్తారు. పద్మా అవార్డులను హోంశాఖ క్లియరెన్స్తో ప్రధాని , మంత్రివర్గం నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తి రాష్ట్రపతి భవన్లో ఉంటే కొంత రాజకీయం నడుస్తుంది. చట్టంపై పట్టున్న ప్రణబ్ ఇటువంటి ఘర్షణలను లౌక్యంగా నివారించారు.
ప్రణబ్ ముఖర్జీకి సంక్షోభ నివారకుడిగా కాంగ్రెస్లో పేరుంది. ఇటువంటి పేరు రావాలంటే రాజకీయాల్లో ఆ నేత కాకలుతీరినవారై ఉండాలి. రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ భవిష్యత్తును అంచనా వేసి కాంగ్రెస్ 2012లో ప్రణబ్ను రాష్ట్రపతిని చేసింది. 2014 భాజపా అధికారంలోకి వచ్చాక మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారత రత్నా ఇవ్వాలనే ప్రతిపాదనలతో ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రణబ్ను కలిశారు. మోదీ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు. కానీ, ఓ సలహా ఇచ్చారు. ఇప్పటికే మరణించిన ఓ గొప్పనేతకు కూడా ఇవ్వాలని సూచించారు. అంతేకాదు మదన్ మోహన్ మాలవీయ పేరును ఆయన మోదీ ఎదుట పెట్టారు. స్వాతంత్ర్య సేనాని, విద్యావేత్త, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు, హిందూ మహాసభకు చెందిన వ్యక్తి అయిన ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు. మోదీ దీనికి అంగీకరించారు. 2015 సంవత్సరానికి అటల్, మాలవీయాలకు భారత రత్న ప్రకటించారు. ప్రణబ్ రాష్ట్రపతి భవన్లో ఉన్నంతకాలం మంత్రి వర్గంతో ఎటువంటి వివాదాలకు తావివ్వలేదు.
కుమార్తెకు కూడా తెలియదు..
2019 జనవరి 25న సాయంత్రం ప్రధాని మోదీ నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు ఫోన్ వచ్చింది. భారత రత్న అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాం.. మీ అంగీకారం కోసం ఫోన్ చేశాను అని మోదీ తెలిపారు. అప్పటికే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు భారత్కు రావడంతో మోదీ వ్యక్తిగతంగా ప్రణబ్ వద్దకు రాలేకపోయారు. మోదీ ప్రతిపాదనకు ప్రణబ్ అంగీకరించారు. వెంటనే రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ప్రణబ్తోపాటు ఉంటున్న ఆయన కుమార్తె శర్మిష్ఠకు అప్పటి వరకూ ఈ విషయం తెలియదు. ‘నీకు భారత రత్న వచ్చినా.. ఏమి జరగనట్లే ఉన్నావు. కనీసం నాకు చెప్పలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ఎవరు ఎంత ప్రయత్నించినా.. ప్రణబ్ నోటి నుంచి రహస్యాలను రాబట్ట లేరు.. ఆయన పైప్ వదిలే పొగ మాత్రమే బయటకు వస్తుంది’’ అని ఇందిరాగాంధీ వ్యాఖ్యానించినట్లు ప్రముఖ జర్నలిస్టు జయంతి ఘోషల్ తెలిపారు. ఆయన ఇందిరా గాంధీకి ఎంత విశ్వాసపాత్రుడో ఈ ఘటన తెలియజేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. -
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా