Taiwan: చైనా- తైవాన్ ఉద్రిక్తతలపై ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు
చైనా- తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు చేసింది. తైవాన్ భద్రత విషయంలో అవసరమైతే తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని పేర్కొంది. తైవాన్ను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటే.. ఆస్ట్రేలియా వారితో చేరకపోవడం...
మెల్బోర్న్: చైనా- తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు చేసింది. తైవాన్ భద్రత విషయంలో అవసరమైతే తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని పేర్కొంది. తైవాన్ను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటే.. ఆస్ట్రేలియా వారితో చేరకపోవడం అనూహ్యమే అవుతుందని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పీటర్ డటన్ శనివారం ఓ వార్తాసంస్థతో అన్నారు. ‘తైవాన్ విషయంలో చాలా స్పష్టంగా, నిజాయతీగా ఉండాలని భావిస్తున్నాం. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మేం ముందుకు రాలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ.. అలా జరుగుతుందని ఊహించలేను’ అని డటన్ అన్నారు.
తైవాన్ను స్వాధీనం చేసుకోవాలనే విషయమై చైనా చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో.. దాన్ని ఎదుర్కొనేందుకు భారీ స్థాయి సంసిద్ధత అవసరమని డటన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. తైవాన్ విషయంలో చైనా తన బలాన్ని ప్రయోగిస్తే.. అమెరికా, దాని మిత్రపక్షాలు తగు చర్యలు తీసుకుంటాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు చైనా సైతం.. తైవాన్లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం పర్యటనను ఖండించింది. తైవాన్ దిశగా పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలిపింది.
జపాన్కు అండగా అమెరికా!
చైనా తమవని పేర్కొంటున్న ద్వీపాలతోపాటు జపాన్నూ రక్షించే విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తమకు హామీ ఇచ్చినట్లు జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి శనివారం వెల్లడించారు. తూర్పు చైనా సముద్రంలో జపాన్ ఆధ్వర్యంలోని సెంకాకు దీవుల విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో పరిస్థితులను మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలను హయాషి, బ్లింకెన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు జపాన్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.