Aryan Khan: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్
బాలీవుడ్ను కుదిపేసిన క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు.
ముంబయి: బాలీవుడ్ను కుదిపేసిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఆర్యన్కు గురువారమే బెయిల్ లభించినప్పటికీ.. విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్, ఆయన సతీమణి గౌరీఖాన్.. ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చారు. అనంతరం ఆర్యన్ను తీసుకొని షారుక్ కుటుంబం మన్నత్కు చేరుకుంది. ఈ కేసులో అరెస్టయిన 28 రోజుల తర్వాత ఆర్యన్ తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. కానీ, అవి సకాలంలో జైలుకు చేరలేదు. విడుదల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆర్యన్ శుక్రవారం రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు. శనివారం ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్ను విడుదల చేశారు.
మూడు వారాల తర్వాత..
డ్రగ్స్ కేసులో అక్టోబరు 3న ఆర్యన్ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజు ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 26న ఈ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ మొదలుపెట్టింది. ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆర్యన్కు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అతడితో పాటు అర్బాన్ ఖాన్, మున్మున్కు బెయిల్ ఇచ్చింది.
అయితే బెయిల్ మంజూరుకు న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. ఇందులో రూ.లక్ష బాండ్ ఒకటి. ఈ బాండ్కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు. జూహీ జామీనును కోర్టు అంగీకరించింది. అనంతరం బెయిల్ పత్రాలను తీసుకుని షారుక్ న్యాయ బృందం నిన్న సాయంత్రం జైలుకు బయల్దేరినప్పటికీ అప్పటికే నిర్దిష్ట సమయం ముగిసిపోయింది. దీంతో శనివారం ఉదయానికి విడుదల ప్రక్రియ పూర్తవ్వడంతో ఆర్యన్ను విడుదల చేశారు. మూడు వారాలపాటు జైలులో ఉన్న ఆర్యన్.. నేడు జైలు నుంచి బయటకు వచ్చాడు.
మన్నత్కు మళ్లీ వెలుగుల కళ..
ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నాటి నుంచి షారుక్ కుటుంబం దిగులులో కూరుకుపోయింది. పండగలు, వేడుకలకు దూరంగా ఉంది. గౌరీఖాన్ అయితే కొడుకు విడుదలవ్వాలని నిత్యం పూజలు చేసినట్లు ఆమె సిబ్బంది తెలిపారు. ఆర్యన్ ఇంటికొచ్చేవరకు మన్నత్లో స్వీట్లు వండొద్దని గౌరీ ఆదేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆర్యన్ బెయిల్పై విడుదలవడంతో షారుక్ నివాసం మన్నత్లో మళ్లీ కోలాహలం నెలకొంది. నిన్న రాత్రి మన్నత్ను లైట్లతో అలంకరించారు. అటు ఆర్యన్ కోసం షారుక్ అభిమానులు ఈ ఉదయం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్లకార్డులు చేతబట్టి, డ్రమ్స్ వాయిస్తూ అతడికి స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్