Anand Mahindra: మహీంద్రా షోరూంలో రైతుకు అవమానం.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?
కర్ణాటకలో కారు కొనేందుకు మహీంద్రా షోరూంకు వెళ్లిన రైతుకు అవమానం జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటకలో కారు కొనేందుకు మహీంద్రా షోరూంకు వెళ్లిన రైతుకు అవమానం జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. కస్టమర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. అసలేం జరిగిందంటే..
కర్ణాటకకు చెందిన కెంపెగౌడ అనే రైతు బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు గత శుక్రవారం తమకూరులోని మహీంద్రా షోరూంకు వెళ్లగా.. అక్కడున్న సేల్స్మెన్ ఆయనను అవమానించారు. రైతు వేషధారణ చూసి.. ‘కారు ధర రూ.10లక్షలు.. నీ వద్ద 10 రూపాయలు కూడా ఉండవు’’ అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి గురైన కెంపెగౌడ.. గంటలో రూ.10లక్షలతో వస్తానని, వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా? అంటూ సవాల్ విసిరారు.
అన్నట్లుగానే గంటలో మొత్తం డబ్బుతో ఆ రైతు షోరూంకు వచ్చారు. అయితే కంగుతిన్న ఆ సేల్స్మెన్ కారు వెయిటింగ్ లిస్ట్లో ఉందని, వాహనాన్ని తక్షణమే డెలివరీ చేయలేమని చెప్పాడు. దీంతో తనకు క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులు రంగంలోకి దిగి సేల్స్మెన్తో రైతుకు క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు.
దీనిపై ఆనంద్ మహీంద్రా నేడు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘మా కంపెనీ ప్రధాన ఉద్దేశం.. అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే. వ్యక్తుల మర్యాదను కాపాడటం మా ప్రధానమైన నైతిక విలువ. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై తక్షణమే చర్యలు ఉంటాయి’’ అని మహీంద్రా వెల్లడించారు. అటు మహీంద్రా ప్రతినిధులు కూడా దీనిపై స్పందించారు. కస్టమర్లను గౌరవిస్తూ.. వారికి ఉత్తమ సేవలు అందించాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..