WHO: ‘జీవితాన్ని కోల్పోవడం కన్నా కార్యక్రమాలను రద్దు చేసుకోవడం మేలు’
ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో పండగ సెలవుల నేపథ్యంలో బంధువులు, స్నేహితుల రాకపోకలు పెరిగినందున.. ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలను రద్దు చేయాల్సి రావొచ్చని...
జెనీవా: ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో పండగ సెలవుల నేపథ్యంలో బంధువులు, స్నేహితుల రాకపోకలు పెరిగాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలను వాయిదా వేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అథానోమ్ కోరారు. తాజాగా జెనీవాలో ఆయన మాట్లాడుతూ.. ‘జీవితాన్ని కోల్పోవడం కంటే కార్యక్రమాలను రద్దు చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు సంబరాల్లో మునిగి, తర్వాత బాధ పడటం కంటే ఇప్పుడు రద్దు చేసుకొని, తర్వాత జరుపుకోవడం మంచిది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
చాలా దేశాల్లో ప్రస్తుతం ఇంటింటి రాకపోకలు పెరిగిన నేపథ్యంలో.. ఇవి మరిన్ని కేసులు, మరణాలకు దారితీస్తాయనడంలో సందేహం లేదని టెడ్రోస్ అన్నారు. దీంతోపాటు ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందనడానికి బలమైన ఆధారాలున్నాయని చెప్పారు. ఇప్పటికే టీకా తీసుకున్నవారికి, వైరస్ నుంచి కోలుకున్న వారికీ సోకుతోందని తెలిపారు. ఇదే సమావేశంలో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ను మునుపటి వేరియంట్లకంటే తేలికపాటిదని ఇప్పుడే నిర్ధారించడం అవివేకం అవుతోందన్నారు. ఈ కొత్త వేరియంట్ కొన్ని రోగనిరోధక వ్యవస్థలను తప్పించుకుంటోందని, ఈ నేపథ్యంలో బలహీన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.