ఏరో ఇండియా: అవకాశాలకు రన్వే
2021లో జరిగే ఏరో ఇండియా కార్యక్రమం అనేక అవకాశాలకు రహదారి అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
దిల్లీ: 2021లో జరిగే ఏరో ఇండియా కార్యక్రమం అనేక అవకాశాలకు రహదారి అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఏరోఇండియా కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ ఏరో ఇండియా కార్యక్రమం ఫిబ్రవరి3-5 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం. ఇది బిలియన్ అవకాశాలకు రన్వే.’’ అని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
ది ఏరో ఇండియా అనే ఈ కార్యక్రమంలో వివిధ ఏరోస్పేస్ కంపెనీలు వాటి ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమం బెంగళూరులోని యెలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జరగనుంది. కరోనా కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులు వారి ఉత్పత్తులను వర్చువల్గానూ ప్రదర్శించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభోత్సవం రోజున 41 ఎయిర్ క్రాఫ్ట్లు ప్రదర్శించనున్నట్లు వారు తెలిపారు. మరో 63 ఎయిర్క్రాఫ్ట్లు డిస్ప్లేలో ఉంటాయన్నారు. వీటిల్లో సూర్యకిరణ్ ఎయిర్ క్రాఫ్ట్, సారంగ్ హెలికాఫ్టర్లు ప్రధానాకర్షణగా నిలుస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ‘ఆత్మనిర్భర్ ఫార్మేషన్ విమానాన్ని’ ప్రదర్శించనున్నట్లు వారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సుఖోయ్, అడ్వాన్డ్స్ లైట్ హెలికాఫ్టర్ ధ్రువ్ వంటి చాలా విమానాలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు వారు ఆ ప్రకటనలో వెల్లడించారు.
ఇవీ చదవండి..
మాస్క్పై మాస్క్ ప్రయోజనమెక్కువ: ఫౌచీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు