8 సెకన్లు క్వారంటైన్ నుంచి వచ్చి, చిక్కాడు
కేవలం ఎనిమిది సెకన్ల పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లఘించినందుకు ఓ వ్యక్తిపై తైవాన్ ప్రభుత్వం 3,500 డాలర్ల జరిమానా విధించింది.
3,500 డాలర్ల జరిమానా విధించిన తైవాన్ ప్రభుత్వం
తైపీ: కేవలం ఎనిమిది సెకన్ల పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తిపై తైవాన్ ప్రభుత్వం 3,500 డాలర్ల జరిమానా విధించింది. అంటే అక్షరాల 2,61,036 రూపాయలు. అది కూడా ఫిలిప్పైన్ నుంచి వచ్చిన ఓ వలస కార్మికుడిపై. వివరాల్లోకి వెళ్తే..
23 మిలియన్ల జనాభా కలిగిన తైవాన్లో ఇప్పటివరకు 700 కరోనా వైరస్ కేసులే వెలుగుచూశాయి. అంటే ఆ దేశం కరోనా నిబంధనలను ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తుందో అర్థమవుతోంది. అలా అని కఠిన లాక్డౌన్ను విధించిన దాఖలాలు మాత్రం లేవు. క్వారంటైన్ నిబంధనలు, మాస్ టెస్టింగ్, త్వరితగతిన కాంటాక్ట్లను గుర్తించడం వంటి చర్యలపై దృష్టిపెట్టి, అలసత్వం లేకుండా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన వలస కార్మికుడికి 14 రోజుల క్వారంటైన్ను విధించింది. కావోసీంగ్లోని హోటల్ గదిని అతడికి కేటాయించింది. అయితే ఆ వ్యక్తి ఎనిమిది సెకన్ల పాటు గది బయటకు వచ్చి, నిల్చున్నట్లు సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు అధికారుల కంట పడింది. పక్కగదిలో ఉన్న తన స్నేహితుడికి ఓ వస్తువును అందించే ఉద్దేశంతో అతడు బయటకు వచ్చినట్లు, తన తోటి వ్యక్తి దాన్ని తీసుకునేందుకు వీలుగా అక్కడ పెట్టివెళ్లినట్లు దానిలో రికార్డైంది. అయితే అనుమతి లేకుండా క్వారంటైన్ సమయంలో బయటకు రావడం, నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని భావించిన అధికారులు ఆయనపై 3,500 డాలర్లు జరిమానా విధించారు. అయితే ఆ వస్తువును తీసుకోవాలంటే అతడి స్నేహితుడు కూడా బయటకు రావాల్సింది ఉంది కాబట్టి, అతడిపై ఈ చర్యే తీసుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. ఈ తీరుగా ఆ దేశం వ్యవహరిస్తుంది కాబట్టే అక్కడ గత ఎనిమిది నెలలుగా కొత్త కేసులు వెలుగుచూడలేదు. కాకపోతే, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.