ఒక వ్యాక్సిన్ డోసు మూడు డాలర్లు!
కొవిడ్-19 వ్యాక్సిన్ ధరను మూడు డాలర్లుగా నిర్ణయించినట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వెల్లడించింది. భారత్ సహా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ధరతో వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు గవి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో.............
దిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్ ధరను మూడు డాలర్లుగా నిర్ణయించినట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వెల్లడించింది. భారత్ సహా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఈ ధరతో వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు గవి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఆక్స్ఫర్డ్, నోవావాక్స్కు చెందిన వ్యాక్సిన్లకు 100 మిలియన్ల డోసులను తయారు చేసి, భారత్ సహా 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వ్యాక్సిన్లు 2021 మధ్యకల్లా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తరవాత వాటి ఉత్పత్తి పెంచేందుకు సీరమ్ సంస్థ గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల మూలధనాన్ని పొందనుంది. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వైరస్ను కట్టడి చేయడానికి పేద దేశాలకు తగిన సహకారం అవసరమని సీరమ్ సంస్థ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రజల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా