రష్యా వ్యాక్సిన్: డేటాపై విమర్శలు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రష్యాది నిర్లక్ష్య ధోరణే అంటున్న అంతర్జాతీయ నిపుణులు
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ను నమ్మడం కష్టమని బ్రిటన్, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలుకంపెనీలు భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాయి. ఇప్పటికే తొలి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకొని వేలమందిపై చేపట్టే మూడో దశకు చేరుకున్నాయి. కానీ, రష్యా మాత్రం వ్యాక్సిన్ ప్రయోగాలపై ఎలాంటి సమాచారం ప్రపంచానికి తెలపకుండానే టీకాను అభివృద్ధి చేసినట్లు ప్రకటించడం నిర్లక్ష్య ధోరణేనని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు మాత్రం రష్యా టీకాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అత్యంతవేగంగా చేసే ప్రయోగాల వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చని బ్రిటన్లోని వార్విక్ బిజినెస్ స్కూల్కు చెందిన పరిశోధకురాలు ఐఫర్ ఆలీ హెచ్చరించారు.
లండన్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన యూనివర్సిటీ కాలేజ్ నిపుణులు కూడా పుతిన్ ప్రకటనను తప్పుపట్టారు. ఇది నిజంగా నిర్లక్ష్యం, మూర్ఖంగా వ్యవహరించడమే అని విశ్వవిద్యాలయ నిపుణులు ఫ్రాన్కోయిస్ బాలౌక్స్ స్పష్టం చేశారు. అసంపూర్తిగా పరీక్షించిన వ్యాక్సిన్ను భారీస్థాయిలో ప్రజలకు అందించడం అనైతికమన్నారు. దీనివల్ల ఏర్పడే పర్యవసానాలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపడంతోపాటు రానున్నరోజుల్లో వ్యాక్సిన్పై ప్రజల్లో వ్యతిరేకభావన ఏర్పడే అవకాశం ఉందని బాలౌక్స్ అభిప్రాయపడ్డారు. లండన్లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఇమ్యూనాలజీ నిపుణులు కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం బ్రిటన్ నిపుణులే కాకుండా రష్యా వ్యాక్సిన్పై జర్మనీ పరిశోధకులు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వ్యాక్సిన్ ఆమోదం పొందేముందు వేలమందిపై దాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, రష్యా మాత్రం వ్యాక్సిన్కు అత్యంత తొందరగా ఆమోదం తెలపడం నిర్లక్ష్యమేనని జర్మనీకి చెందిన పీటర్ క్రెమ్స్నెర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ కోసం ఇప్పటికే మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనికా వంటి పరిశోధన సంస్థలు వాటి వ్యాక్సిన్లను వేలమందిపై ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. పరిశోధనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణ సంస్థలకు అందిస్తున్నాయి. కానీ రష్యా తయారు చేసిన వ్యాక్సిన్పై సరైన సమాచారం లేదని నిపుణులు వాదిస్తున్నారు. వ్యాక్సిన్లు ఎలా తయారు చేశారు? వాటి రోగనిరోధక సామర్థ్యాలు, కొవిడ్ను ఎదుర్కొంటున్నట్లు రుజువులు, వ్యాక్సిన్ సురక్షితం అనడానికి కావాల్సిన సమాచారాన్ని ఎక్కడా ప్రచురించకపోవడాన్ని అంతర్జాతీయంగా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడైన ఆంటోనీ ఫౌచీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. వ్యాక్సిన్ కోసం రష్యా, చైనా పరిశోధకులు సరైన ప్రయోగాలు నిర్వహిస్తున్నారని ఆశిస్తున్నామన్నారు. ప్రయోగాలు చేపట్టకుండానే వ్యాక్సిన్ పంపిణీ కోసం సిద్ధంచేయడం సమస్యలకు దారితీస్తుందని ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, టీకాను విడుదల చేయడానికి ముందు అన్ని దశల్లో దాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచదేశాలను ఇప్పటికే కోరింది.
ఇవీ చదవండి..
వ్యాక్సిన్ సిద్ధం
రష్యా వ్యాక్సిన్కు 20దేశాల ఆర్డర్లు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ