వచ్చే ఏడాదిలోనే పుతిన్‌ భారత్‌ పర్యటన!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తారని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది.

Published : 21 Dec 2020 20:44 IST

దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తారని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సంవత్సరం చివరనే పుతిన్‌ భారత్‌ పర్యటన చేయాల్సి ఉండగా, కరోనా విజృంభణ నేపథ్యంలో అది వాయిదా పడినట్లు పేర్కొంది. ‘కరోనా మహమ్మారి నేపథ్యంలో నేరుగా కలవడం ఇబ్బందిగా మారింది. అయితే, ముఖాముఖీగా కలువలేకపోతున్నా.. భారత్‌-రష్యా మధ్య రాజకీయ, ఆర్థికపరమైన సంప్రదింపుల్లో ఎటువంటి లోటు లేదు. ఈ అక్టోబర్‌లోనే ఇరుదేశాల మధ్య సదస్సు జరగాల్సి ఉంది. కానీ, కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా సదస్సును వాయిదా వేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అయితే, వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లోనే అధ్యక్షుడి పుతిన్‌ భారత్‌లో పర్యటిస్తారని ఆశిస్తున్నాం’ అని రష్యా రాయబారి నికోలయ్ కుదాషెవ్ వెల్లడించారు.

ఇక సైనిక సహకారం కోసం ద్వైపాక్షిక కమిషన్‌ వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఏర్పాటయ్యే అవకాశముందని నికోలయ్ కుదాషెవ్ అభిప్రాయపడ్డారు. వీటితో పాటు ఆర్మేనియా, బెలారస్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, రష్యా దేశాలు భాగస్వామ్యం కలిగిన యురేషియా ఎకనామిక్‌ యూనియన్‌(EAEU), భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కూడా జరిగే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి..
పుతిన్‌..ఓ మిస్టరీ..!
రష్యా వ్యాక్సిన్‌పైనే భారతీయుల గురి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని