ముగిసిన ప్రణబ్‌ అంత్యక్రియలు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Updated : 01 Sep 2020 14:24 IST

దిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. దిల్లీలోని లోధి శ్మశానవాటికలో ప్రణబ్‌ ముఖర్జీ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.  కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రణబ్‌ పార్థివ దేహంపై సైనికులు జాతీయ పతాకం ఉంచారు.  కొవిడ్‌ నిబంధనల ప్రకారమే ఈ కార్యక్రమం పూర్తిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని