దిల్లీ అల్లర్ల కేసులో ఛార్జిషీటు దాఖలు

దిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక విభాగం పోలీసులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద ఛార్జిషీటు....

Updated : 16 Sep 2020 20:05 IST

దిల్లీ: దిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక విభాగం పోలీసులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద ఛార్జిషీటు నమోదు చేశారు. మొత్తం 10వేల పేజీలున్న ఈ ఛార్జిషీటును పోలీసులు కర్కర్‌దూమ న్యాయస్థానానికి సమర్పించారు. అయితే, ఇటీవల అరెస్టైన ఉమర్‌ ఖలీద్‌ సహా షర్జీల్‌ ఇమామ్‌ పేర్లను తాజా నిందితుల జాబితాలో పోలీసులు పేర్కొనలేదు.

గత కొద్ది రోజుల కిందట విడుదలైన అనుబంధ ఛార్జిషీటులో వారి పేర్లు ఉండటంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం డీసీపీ ప్రమోద్‌ సింగ్‌ కుశ్వాహ మాట్లాడుతూ.. దిల్లీలో జరిగిన హింస ‘ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రే’ అని తమ విచారణలో తేలిందని చెప్పారు.

ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో దాదాపు 53 మంది దుర్మరణం చెందారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి హత్య కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత తాహిర్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని