సచిన్‌‌కు ఊరట: శుక్రవారం వరకు చర్యలొద్దు..!

రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు తాత్కాలిక ఊరట కలిగింది. జులై 24 వరకు సచిన్‌ పైలట్‌తోపాటు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్‌ హైకోర్టు తెలిపింది స్పీకర్‌కు సూచించింది. అంతేకాకుండా రెబల్‌ ఎమ్మెల్యేలు వేసిన రిట్‌పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తీర్పును జులై 24కు వాయిదా వేసింది.

Published : 21 Jul 2020 16:45 IST

రాజస్థాన్‌ హైకోర్టు వెల్లడి

జైపూర్‌: రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు తాత్కాలిక ఊరట కలిగింది. జులై 24 వరకు సచిన్‌ పైలట్‌తోపాటు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్‌ హైకోర్టు స్పీకరుకు సూచించింది. రెబల్‌ ఎమ్మెల్యేలు వేసిన రిట్‌పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తీర్పును జులై 24కు వాయిదా వేసింది. స్పీకర్‌ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు రాజస్థాన్‌ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. 

ఇదిలాఉండగా, ఈ సాయంత్రం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్షతన  రాష్ట్ర కేబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది.  ఈ ఉదయం ప్రారంభమైన రాజస్థాన్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని