బీరుట్ బ్లాస్ట్: స్వతంత్ర దర్యాప్తు జరపాలి-ఐరాస!
లెబనాన్లో రాజధాని బీరుట్లో జరిగిన భారీ పేలుళ్లపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఈ దుర్ఘటనలో 150మందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో బాధితులుగా మారారు. ఈ సందర్భంలో జవాబుదారీ కోరుతున్న బాధితుల గొంతుకను తప్పక వినాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం స్పష్టం చేసింది
157కు చేరిన మృతుల సంఖ్య, 5వేలకుపైగా గాయాలు
వెల్లువెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
బీరుట్: లెబనాన్లో రాజధాని బీరుట్లో జరిగిన భారీ పేలుళ్లపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఈ దుర్ఘటనలో 150మందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలో జవాబుదారీ కోరుతున్న బాధితుల గొంతుకను తప్పక వినాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం స్పష్టం చేసింది. బీరుట్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం అధికార ప్రతినిధి రూపెర్ట్ కోల్విల్లే ప్రపంచదేశాలను కోరారు. అత్యంత వేగంగా స్పందించి లెబనాన్ను ఆదుకోవడంలో సాయపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న లెబనాన్, కరోనావైరస్తోపాటు అమ్మోనియం నైట్రేట్వంటి సంక్షోభాలతో సతమతమవుతోందని కోల్విల్లే అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో లెబనాన్ నాయకులు రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గత సంవత్సరం అక్టోబర్ నెలలో లెబనాన్ భారీ నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే.
ఆందోళనలతో దద్దరిల్లిన బీరుట్..
బీరుట్లో భారీ పేలుళ్లకు లెబనాన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ నగరవాసులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన నిరసనకారులు వీధుల్లోని వాహనాలు, దుకాణాలకు నిప్పుపెట్టారు. వీటిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడికి దిగారు. దీంతో అటు పోలీసులు, నిరసనకారులు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే, బీరుట్ దుర్ఢటనలో మరణించిన వారిసంఖ్య 157కు చేరగా గాయపడిన వారిసంఖ్య 5వేలు దాటింది.
ఇవీ చదవండి..
అణ్వస్త్ర దాడిని తలపించిన విధ్వంసం
బీరుట్లో పేలుడు జరిగే సమయంలో ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్