దేశంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ సాధ్యం కాదు!
అధిక జనాభా కలిగిన దేశంలో సాధరణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్ ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని......
ఇమ్యూనైజేషన్తోనే సాధ్యమన్న కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందని వెల్లడి
దిల్లీ: అధిక జనాభా కలిగిన దేశంలో సాధారణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్ ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈవైరస్ను ఎదుర్కోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. దేశంలో కరోనా వైరస్ తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీ రేటు 64.4శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్ నెలలో 7.85 శాతంగా ఉన్న ఈ రేటు ప్రస్తుతం 64 శాతానికి చేరుకోవడం ఊరట కలిగించే విషయమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 10లక్షల మంది కోలుకున్నారని స్పష్టం చేసింది. వైద్యులు, నర్సులతోపాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగానే బాధితులు ఈ స్థాయిలో కోలుకుంటున్నట్లు అభిప్రాయపడింది.
16 రాష్ట్రాల్లో ఎక్కువ రికవరీ..
ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకునే వారి శాతం జాతీయసగటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. అత్యధిక రికవరీ రేటు దిల్లీలో 88 శాతం ఉండగా, లద్దాఖ్లో 80%, హరియాణా 78%, అసోం 76%, తెలంగాణ 74%, తమిళనాడు, గుజరాత్లలో 73%, రాజస్థాన్ 70%, మధ్యప్రదేశ్ 69%, గోవాలో 68% మంది కోలుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కోటీ 81లక్షల కొవిడ్ పరీక్షలు..
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నిర్ధారణ పరీక్షలు భారీగా పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు కోటీ 81 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. నిత్యం జరిపే కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచుతున్నామని తెలిపింది. ప్రస్తుతం ప్రతిరోజూ ప్రతి పదిలక్షల జనాభాకు 324 టెస్టులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మూడో దశలో 3 వ్యాక్సిన్లు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల రూపకల్పనలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. వీటిలో అమెరికా, యూకే, చైనా దేశాల వ్యాక్సిన్లు మూడో దశలో ఉన్నాయి. ఇక భారత్లో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు ఫేజ్-1, ఫేజ్-2 దశల్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదటి వ్యాక్సిన్ను 8 ప్రదేశాల్లో దాదాపు 1150 మందిపై ప్రయోగిస్తుండగా, రెండో వ్యాక్సిన్ను ఐదు ప్రదేశాల్లో వెయ్యి మందిపై ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం దాన్ని ఎవరికి, ఎలా ఇవ్వాలనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అభిప్రాయపడ్డారు.
2.21 శాతానికి తగ్గిన మరణాల రేటు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల రేటు భారత్లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రపంచ సగటు 4శాతం ఉండగా భారత్లో 2.21శాతంగా ఉన్నట్లు తెలిపింది.
అత్యధిక మరణాల రేటు ఉన్న దేశాలు..
దేశం మరణాల రేటు(శాతంలో)
యూకే 15.3
మెక్సికో 11.1
ఇరాన్ 5.5
బ్రెజిల్ 3.6
అమెరికా 3.5
భారత్ 2.21
రష్యా 1.6
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..