రైతులూ.. సంఘ విద్రోహులపై నిఘా వేయండి
రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. నిరసనలు చేపట్టిన రైతు సంఘాలు తమ వేదిక దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. అన్నదాతల పట్ల.....
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
దిల్లీ: రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కుట్ర చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. నిరసనలు చేపట్టిన రైతు సంఘాలు తమ వేదిక దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. అన్నదాతల పట్ల ప్రభుత్వం సున్నితంగా ఉందని స్పష్టం చేశారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు వారి ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు.
‘‘రైతుల అభ్యంతరాల పరిష్కారం కోసం రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపించాం. మరిన్ని చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల ముసుగులో రైతు ఉద్యమాన్ని నాశనం చేసేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తమ ఉద్యమ వేదిక దుర్వినియోగం కాకుండా రైతు సోదరులు నిరంతరం నిఘా ఉంచాలని పిలుపునిస్తున్నా’’ అని తోమర్ ట్వీట్ చేశారు.
దిల్లీలోని సింఘు, టిక్రి వద్ద కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వేర్వేరు అభియోగాలతో అరెస్టు చేసిన రచయితలు, మేధావులను విడుదల చేయాలని కోరుతూ కొన్ని పోస్టర్లు అక్కడ కనిపించాయి. జేఎన్యూ విద్యార్థి నేతలు ఖాలిద్, షర్జీల్ ఇమామ్ను విడుదల చేయాలన్న పోస్టర్లూ దర్శనమిచ్చాయి. కాగా తమ ఉద్యమంతో రాజకీయాలకు సంబంధం లేదని రైతులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.