భారత్లో కరోనా విలయం: కోటికి చేరిన కేసులు!
గడిచిన తొమ్మిది నెలలుగా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు బయటపడిన కేసుల సంఖ్య కోటికి చేరువయ్యింది.
దిల్లీ: గడిచిన తొమ్మిది నెలలుగా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, గతకొన్ని రోజులుగా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. శుక్రవారం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువయ్యింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం, శుక్రవారం ఉదయానికి దేశంలో 99లక్షల 79వేల మందికి వైరస్ సోకగా వీరిలో 95లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు. లక్షా 44వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 95.40 శాతం ఉండగా, మరణాల రేటు 1.45శాతంగా ఉంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3లక్షలుగా(3.14శాతం) ఉంది.
అమెరికా తర్వాత భారత్లోనే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7కోట్ల 50లక్షలు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదించింది. వీటిలో అత్యధికంగా అమెరికాలోనే కోటి 72లక్షల మందికి వైరస్ సోకగా 3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రెండో దేశంగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ కొవిడ్ కేసుల సంఖ్య కోటికి చేరింది.
మార్చి నెలలో తొలి కరోనా మరణం ..
దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30వ తేదీన నమోదైంది. మార్చి నెలలో లాక్డౌన్ విధించేనాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 600లకు చేరుకుంది. అప్పటికే 13 మంది మృత్యువాతపడ్డారు. తొలి కరోనా మరణం మాత్రం మార్చి 12వ తేదీన కర్ణాటకలో రికార్డయ్యింది. సౌదీ అరేబియా వెళ్లివచ్చిన కాలబుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు కరోనా మహమ్మారి బారినపడి మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయన హైదరాబాద్లో చికిత్స తీసుకున్న అనంతరం తన సొంతూరుకు వెళ్లిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు (గడిచిన తొమ్మిది నెలల కాలంలో) లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ప్రతి పదిలక్షల కేసులు..ఇలా..
దేశంలో జనవరి నెలలో తొలి కేసు నమోదైనప్పటికీ మార్చి వరకు కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అనంతరం లాక్డౌన్ విధించడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. కానీ, అన్లాక్ ప్రక్రియ మొదలైన నాటినుంచి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైన రికార్డులూ ఉన్నాయి. కేవలం ఒక్క సెప్టెంబర్ నెలలోనే 26లక్షల పాజిటివ్ కేసులు, 33వేల మరణాలు రికార్డయ్యాయి. అక్టోబర్లోనూ వైరస్ తీవ్రత కొనసాగింది. నవంబర్ నుంచి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రతి పదిలక్షల కేసులు నమోదైన తేదీలు ఇలా ఉన్నాయి..
తేదీ కేసులు
17 జులై 10లక్షల మార్కు దాటింది.
07 ఆగస్టు 20లక్షలు
23 ఆగస్టు 30లక్షలు
05 సెప్టెంబర్ 40లక్షలు
16 సెప్టెంబర్ 50లక్షలు
28 సెప్టెంబర్ 60లక్షలు
11 అక్టోబర్ 70లక్షలు
29 అక్టోబర్ 80లక్షలు
20 నవంబర్ 90లక్షలు
18 డిసెంబర్ 99.79లక్షలు కేసులు నమోదయ్యాయి.
2వేలు దాటిన టెస్టింగ్ కేంద్రాలు..
దేశంలో వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరాన్ని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది. జనవరి 23వరకు దేశంలో ఒకేఒక్క టెస్టింగ్ కేంద్రం ఉండగా మార్చి 23కు ఆ సంఖ్య 160కు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 2264 కేంద్రాలకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 1195 ప్రభుత్వ ల్యాబ్లు ఉండగా, 1069 ల్యాబ్లు ప్రైవేటు ఆధ్వర్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. వీటి ద్వారా నిత్యం దాదాపు 10లక్షలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 15కోట్ల 89లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) పేర్కొంది.
వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య ఇలా..
దేశం కేసుల సంఖ్య మరణాలు
అమెరికా 1,72,14,177 3,10,801
భారత్ 99,79,447 1,44,789
బ్రెజిల్ 71,10,434 1,84,827
రష్యా 27,46,843 49,170
మెక్సికో 12,89,298 1,16,487
ఇవీ చదవండి..
కొవిడ్19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు
గుజరాత్లో మరో ప్రాణాంతక వ్యాధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్