చైనాకు చీవాట్లు..!
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది.
మానవహక్కుల ఉల్లంఘనలపై ప్రపంచదేశాల చురకలు
జెనీవా: ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది. హాంగ్కాంగ్తోపాటు షిన్జియాంగ్ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనాపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడ్డాయి. సాధ్యమైనంత త్వరగా ఆయా ప్రాంతాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని చైనాకు చురకలంటించాయి. సెప్టెంబర్14 నుంచి అక్టోబర్ 7వరకు జరుగుతోన్న ఐరాస మానవ హక్కుల మండలి(UNHRC) సమావేశం దీనికి వేదికైంది. ఈ సందర్భంలో చైనాలో జరుగుతోన్న మానవహక్కుల ఉల్లంఘనలపై వివిధ దేశాలు విరుచుకుపడ్డాయి.
గత కొంతకాలంగా హాంగ్కాంగ్, షిన్జియాంగ్ ప్రాంతాల ప్రజలపై చైనా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలో కూడా ప్రపంచ దేశాలు చైనాకు చీవాట్లు పెట్టాయి. హాంగ్కాంగ్, టిబెట్, షిన్జియాంగ్ ప్రాంతాల్లోని ప్రజలు, జర్నలిస్టులు, లాయర్లతోపాటు విమర్శకులు కూడా తీవ్ర అణచివేతకు గురౌతున్నారని 50మందితో కూడా ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం వెల్లడించింది. ఈ విధంగా హక్కుల పరిరక్షకులను అణచివేయడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు, డిజిటల్ నిఘావంటి చర్యలకు పాల్పడుతోందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జాన్ ఫిషర్ వెల్లడించారు. దాదాపు 60దేశాలనుంచి 300లకుపైగా ఎన్జీవోల తరపున జాన్ ఫిషర్ ఈ సమావేశంలో మాట్లాడారు. ఏ ప్రాంతం కూడా చట్టానికి అతీతం కాదని, ప్రస్తుతం చైనా వంతు వచ్చిందని ఫిషర్ అభిప్రాయపడ్డారు.
*షిన్జియాంగ్లో జరుగుతోన్న అరాచకాలను మారణహోమంగా యూరోపియన్ యూనియన్ జెవీష్ విద్యార్థుల ప్రతినిధి అభివర్ణించారు. నిర్బంధ క్యాంపుల ద్వారా అక్కడి వీగర్ తెగకు చెందిన మైనారిటీలను చైనా వేధిస్తోందని ఆరోపించారు.
*హాంగ్కాంగ్లో వెల్లువెత్తుతున్న నిరసనలను అణచివేసేందుకే కొత్తగా జాతీయ భద్రతా చట్టాన్ని చైనా తీసుకొచ్చిందని బ్రిటన్కు చెందిన తరీఖ్ అహ్మద్ ఆరోపించారు. అంతేకాకుండా నిర్బంధ కుటుంబ నియంత్రణతోపాటు శ్రమ దోపిడికి చైనా పాల్పడుతోందన్నారు.
*మానవహక్కుల కమిషనర్తోపాటు స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని షిన్జియాంగ్ ప్రాంతంలో స్వేచ్ఛగా పర్యటించేందుకు అనుమతించాలని ఈయూ తరపున హాజరైన జర్మనీ ప్రతినిధి మైఖేల్ ఫ్రేయర్ చైనాకు సూచించారు. ముఖ్యంగా షిన్జియాంగ్లో మత స్వేచ్ఛపై ఉన్న ఆంక్షలు, వీగర్ తెగకు చెందిన మైనారిటీ ముస్లింల నిర్బంధ క్యాంపులపై ఈయూ ఆందోళన చెందుతోందన్నారు.
*చిన్నారులను తమ తల్లిదండ్రులకు దూరం చేస్తూ నిర్బంధ క్యాంపుల్లో ఉంచడం భయాందోళనకు గురిచేస్తోందని కెనడా ప్రతినిధి లెస్లీ నార్టన్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదిలాఉంటే, షిన్జియాంగ్ ప్రాంతంలో దాదాపు 16వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను చైనా ధ్వంసం చేసినట్లు ఈమధ్యే ఆస్ట్రేలియన్ స్ట్రాటెజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఏఎస్పీఐ) నివేదిక బయటపెట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?