6వారాల్లో కరోనా స్ట్రెయిన్కు టీకా తేగలం!
జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘బయోఎన్ టెక్’ కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్-19 స్ట్రెయిన్కు టీకా తయారు చేయగలమని ప్రకటించింది.
బెర్లిన్: జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘బయోఎన్ టెక్’ కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆరు వారాల్లో కొవిడ్-19 స్ట్రెయిన్కు టీకా తయారు చేయగలమని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉగుర్ సాహిన్ ఓ మీడియాతో పేర్కొన్నారు. ‘కొత్తరకం స్ట్రెయిన్ మీద కొవిడ్-19 టీకా సమర్థంగానే పనిచేస్తుంది. ఒకవేళ అవసరమైతే ఈ రకం వైరస్పై నేరుగా ప్రయోగాలు ప్రారంభిస్తాం. ఆరు వారాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్కు బయోఎన్టెక్ టీకాను అందుబాటులోకి తీసుకురాగలదు’ అని చెప్పారు. మరోవైపు కొవిడ్-19కు సంబంధించి ఇప్పటికే ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలు రూపొందించిన ‘ఫైజర్ టీకా’ను అత్యవసరంగా ఉపయోగించేందుకు పలు దేశాలు అనుమతించిన ఇచ్చాయి.
యూకేలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలు యూకే విమానాలపై ఆంక్షలు విధించాయి. భారత్ కూడా అప్రమత్తమై ఆయా దేశాల విమానాలను తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయించింది. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఐసోలేషన్ ఏర్పాట్లకు సమాయాత్తం చేసింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా