థ్రిల్లర్: ఇరాన్లో ‘మొస్సాద్’ వేట..!
శుక్రవారం మూడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇరాన్లోని అబ్సార్డ్ పట్టణంలో వెళుతున్నాయి.. హఠాత్తుగా ఓ భారీ పేలుడు.. ఏం జరుగుతోందో తెలిసే సమయానికి మధ్యలోని కారు వద్దకు ఆగంతకులు చేరుకొని విచక్షణ రహితంగా తూటాల వర్షం కురిపించారు.
* అణు పితామహుడి హత్య..
* కుంటుపడ్డ ‘గ్రీన్సాల్ట్ ప్రాజెక్టు’
* మొన్న అల్ఖైదా నంబర్-2 అంతం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
శుక్రవారం మూడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇరాన్లోని అబ్సార్డ్ పట్టణంలో ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ భారీ పేలుడు.. ఏం జరుగుతోందో తెలిసేలోపే మధ్యలోని కారు వద్దకు ఆగంతకులు చేరుకొని విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించారు. ఆ కారులోని వీవీఐపీ మరణించినట్లు ధ్రువీకరించుకొని వెళ్లిపోయారు. ఈ ఘటన ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ. ఆ చనిపోయిన వీవీఐపీ ఎవరో కాదు.. ఆ దేశ అణుకార్యక్రమ పితామహుడిగా భావించే మొసిన్ ఫక్రిజాద్..! ఈ విషయం తెలిసన వెంటనే ఇరాన్ అగ్గిమీద గుగ్గిలం అయింది. దీని వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉందని.. దీనికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ ఎప్పటిలానే ఏమీ స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఫక్రిజాద్ హత్యపై ఇజ్రాయెల్ రిపోర్టర్ కథనాన్ని రీట్వీట్ చేసి ఊరుకొన్నారు.
గతంలో అమెరికా సీఐఏకు తమ దేశంలో ఏజెంట్లుగా పనిచేస్తున్న వారినే గుర్తించి.. వెతికి, వేటాడి చంపిన ఇరాన్లోనే.. ఇజ్రాయెల్ మొస్సాద్ ఏజెంట్లు స్వైర విహారం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఇరాన్లో నక్కిన అల్ఖైదా నంబర్-2ను వేటాడి మట్టుబెట్టారు.
ఎవరీ ఫక్రిజాద్..?
మొసిన్ ఫక్రిజాద్ ఓ భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఇమామ్ హుస్సేన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తారని ఇరాన్ బాహ్య ప్రపంచానికి చెబుతుంది. కానీ, ఆ దేశ డీఫాక్టో పాలకులైన ఖోమైనీలకు మాత్రం జవాబుదారీగా ఉండే ‘ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్’కోర్లో ఆయనకు బ్రిగేడియర్ హోదా ఉంది. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్సీవ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చి’కి, ‘గ్రీన్ సాల్ట్ ప్రాజెక్ట్’కు నాయకత్వం వహిస్తున్నారు. 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఇరాన్ అణుకార్యక్రమైన ఏఎంఏడీ ప్రాజెక్టుకు ఫక్రిజాద్ను కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. ఫక్రిజాద్ భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన దగ్గరకు కూడా ఎవరూ వెళ్లలేరు. ఆయన్ను ఇరాన్ రాబర్ట్ ఓప్పెన్ హైమర్ (అమెరికా అణుపితామహుడు)తో పోలుస్తూ గతంలో వాల్స్ట్రీట్ పత్రిక పేర్కొంది.
ఈ ‘గ్రీన్సాల్ట్ ప్రాజెక్టు’ ఏమిటీ..?
అణ్వాయుధ తయారీలో యురేనియం ఇంధనంగా ఉపయోగపడుతుంది. భూమి నుంచి వెలికితీసిన రూపంలో దీనిని వాడరు.. శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేసి ఆయుధ గ్రేడు యూరేనియం తయారు చేసే కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పెట్టిన పేరు ‘గ్రీన్సాల్ట్ ప్రాజెక్టు’. దీనినే ‘ప్రాజెక్టు1-11’ అని కూడా అంటారు. ఇక్కడే క్షిపణుల వార్హెడ్లను కూడా తయారు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ఫక్రిజాద్ కీలకమైన వ్యక్తి.
కార్లలో మాటువేసి..!
కొన్నేళ్లుగా ఫక్రిజాద్ కోసం సీఐఏ, మొస్సాద్ ఏజెంట్లు కాచుకు కూర్చున్నారు. దీంతో ఆయనకు ఇరాన్ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. బుల్లెట్ ప్రూఫ్ కార్లతోపాటు గన్మెన్లు ఆయన వెన్నంటే ఉంటారు. దీంతో ఆయన హత్య కోసం దాదాపు 62 మంది ఓ బృందంగా పనిచేశారని ఇరాన్ జర్నలిస్టు మొహమ్మద్ ఆహ్వాజే తన కథనంలో పేర్కొన్నారు. వీరిలో అత్యంత సుశిక్షితులైన 12 మంది సాయుధులు కాగా.. మిగిలిన వారు ప్లాన్ అమలుకు సహకరించినట్లు పేర్కొన్నారు.
గత శుక్రవారం ఫక్రిజాద్ టెహ్రాన్కు 40కిమీ దూరంలోని అబ్సార్డ్ పట్టణంలోకి వస్తున్నట్లు ఆగంతకులు సమాచారం తెలుసుకొన్నారు. ఈ పట్టణం ఓ పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ టెహ్రాన్లోని సంపన్నుల గెస్ట్హౌస్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. పట్టణం మొదట్లో భారీ వృక్షాలు ఉంటాయి. దీంతో అక్కడే హత్య చేయాలని సాయుధులు ప్లాన్ వేశారు. ఒక కారు, నాలుగు మోటార్ సైకిళ్లపై వారు సిద్ధంగా ఉన్నారు. మరో ట్రక్కులో బాంబును అమర్చి ఉంచారు. ఫక్రిజాద్ వాహన శ్రేణిలోని మూడు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అక్కడకు రాగానే కరెంటు పోయింది. ట్రక్కు బాంబును పేల్చారు. అనంతరం 12 మంది సాయుధులు నేరుగా ఫక్రిజాద్ కారు వద్దకు చేరుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వాహనాలపై వచ్చి కాల్పులు జరిపి అదృశ్యం కావడం మొస్సాద్ స్టైల్.. అందుకే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ను నిందిస్తోంది. గతంలో కూడా అర్డెషిర్ హుస్సేన్ పౌర్, మసూద్ అలీ మహమ్మద్, మాజిద్ షహరియార్, ముస్తఫా అహ్మద్ రోషన్ల వంటి అణు శాస్త్రవేత్తలను కూడా ఇలానే అంతమొందించారు.
కొన్నాళ్ల క్రితమే అల్ఖైదా నంబర్-2 అంతం..!
ఆగస్టు 7వ తేదీన టెహ్రాన్లో తెల్లరంగు కారుపై బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి క్షణాల్లో అదృశ్యమైపోయారు. ఆ కారులో ఉన్న ఓ వ్యక్తి.. అతని కుమార్తె ఈ ఘటనలో మరణించారు. ఆ మరణించిన వ్యక్తి పేరు హబీబ్ దావూద్ ఇబ్రహీం అని.. లెబనాన్ హిస్టరీ ప్రొఫెసర్ అని ఇరాన్ పేర్కొంది. హిజ్బోల్లాతో కలిసి పనిచేస్తారని వెల్లడించింది. కారులోని మహిళ అతని కుమార్తె మరియం అని చెప్పారు. కానీ, ఆ పేరుతో అసలు హిస్టరీ ప్రొఫెసర్ ఎవరూ లేరని తేలింది. హిజ్బోల్లా కూడా దీనిపై ఏమీ మాట్లాడలేదు. నవంబర్ 13న అసలు విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. ఆగస్టు 7న మరణించిన వ్యక్తి ఈజిప్టు వాసి అబ్దుల్లా అహ్మద్ అబ్దుల్లా.. అలియాస్ అబు అల్ మస్రీ..! అల్ఖైదా నంబర్ 2..! 1998లో ఆఫ్రికాలో కెన్యా రాజధాని నైరూబీలో, టాంజానియాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడికి సూత్రధారి. బిన్లాడెన్ వెంట వచ్చి అల్ఖైదా ఏర్పాటు చేసిన తొలి వందమందిలో ఏడో వ్యక్తి. అల్మస్రీతోపాటు మరణించిన మరియంను..ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా భార్యగా గుర్తించారు. హమ్జాను 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అల్ఖైదాను ఇరాన్ వ్యతిరేకిస్తోంది. కానీ, దివంగత జనరల్ ఖాసీం సులేమానీ ఆశీస్సులతో వీరికి ఆశ్రయం దొరికింది.
అల్మస్రీని మట్టుబెట్టే పనిని అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్కు అప్పజెప్పింది. సీఐఏ మస్రీ అనుపానులు సేకరించి మొస్సాద్కు అందించింది. మొస్సాద్కు చెందిన అత్యంత శక్తిమంతమైన ‘కిదూన్’ యూనిట్ రంగంలోకి దిగింది. మొస్సాద్ మిగిలిన ఏజెంట్లకు కూడా ఈ కిదూన్ యూనిట్ వివరాలు తెలియవు. ఇజ్రాయెల్ హైప్రొఫైల్ వ్యతిరేకులను మట్టుబెట్టడం దీని విధి. లక్ష్యం ఛేదించాక ఆధారాలు లేకుండా అదృశ్యం కావడం దీని స్టైల్. కొన్నాళ్ల కిందట ఇరాన్ రక్షణ స్థావరాల్లో పేలుళ్లు కూడా ఇదే విభాగం చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. బైక్పై వచ్చి మట్టుబెట్టడం కిదూన్ మార్క్ స్టైల్. 1998 పేలుళ్లలో కెన్యాలో చనిపోయిన వారిలో ఇజ్రాయిలీలు కూడా ఉన్నారు. అందుకే కిదూన్ రంగంలోకి దిగి మస్రీపై ప్రతీకారం తీర్చుకొంది. 1998లో పేలుళ్లు జరిగింది ఆగస్టు 7వ తేదీనే.. మస్రీ అంతం కూడా సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఆగస్టు 7వ తేదీనే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ప్రశంసలు కురిపించింది. -
270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. యువతికి రూ.1.36 లక్షల జరిమానా
బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్
Chandrayaan: చంద్రుడి ఉపరితలంపై భారతీయుడు అడుగు పెట్టేవరకు భారత జాబిల్లి యాత్రలు కొనసాగుతాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. -
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. తొలి దశకు సంబంధించి ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడింది. -
మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ
తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టత ఇచ్చారు. -
‘ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం
నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ఓ జంట తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫుట్రెస్ట్పై బాలుడిని నిలబెట్టి ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది. -
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు. -
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!