Aryan Khan: కరెంట్ కట్ వల్లే ఆర్యన్ ఖాన్ విడుదల ఆలస్యం..!
డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు గత శనివారం బెయిల్పై విడుదలయ్యాడు. నిజానికి అతడికి గురువారమే బాంబే
ముంబయి: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు గత శనివారం బెయిల్పై విడుదలయ్యాడు. నిజానికి అతడికి గురువారమే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరుచేసినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో రెండు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఈ ఆలస్యానికి కరెంట్ కోతలే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు ఈ కేసులో మరో నిందితుడైన అర్బాజ్ మర్చెంట్ తండ్రి, సీనియర్ న్యాయవాది అస్లామ్ మర్చెంట్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా అర్బాజ్, మున్మున్లకు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు గత గురువారం తీర్పు వెలువరించింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఉత్తర్వులను ఆ మరుసటి రోజు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు కోర్టు నుంచి అందడం ఆలస్యమవడంతో ఆర్యన్ శుక్రవారం రాత్రి కూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే కోర్టులో విద్యుత్ అంతరాయం కారణంగా రిలీజ్ మెమో ఆలస్యంగా వచ్చిందని అస్లామ్ తాజాగా వెల్లడించారు. ‘‘బెయిల్కు సంబంధించి రిలీజ్ మెమో టైప్ చేస్తుండగా.. కోర్టులో పలుసార్లు కరెంట్ కట్ అయ్యింది. దాదాపు 25 నుంచి 35 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అందువల్ల ఆర్యన్ విడుదల ఉత్తర్వులు అతడి న్యాయ బృందానికి ఆలస్యంగా అందాయి. దీంతో వారు సాయంత్రం 5.30 గంటల్లోగా జైలుకు చేరుకోలేకపోయారు’’ అని అస్లామ్ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం కోర్టు ఉత్తర్వులు తీసుకుని షారుక్ న్యాయబృందం ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లేసరికి నిర్దిష్ట గడువు దాటిపోయింది. సమయం పొడిగించేందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. శనివారం ఉదయం విడుదల ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం ఉదయం 11 గంటలకు ఆర్యన్ను అధికారులు జైలు నుంచి విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం