పాక్ పన్నాగం.. పసిగట్టి పట్టుకున్న ఆర్మీ
భారత్లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను సైన్యం మరోసారి భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆయుధాల సరఫరాను చాకచక్యంగా అడ్డుకుంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్లోని కెరన్ సెక్టార్లో గల కిషన్గంగా నదిలో ఉగ్రవాదుల కదలికలను ఆర్మీ
శ్రీనగర్: భారత్లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను సైన్యం మరోసారి భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆయుధాల సరఫరాను చాకచక్యంగా అడ్డుకుంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్లోని కెరన్ సెక్టార్లో గల కిషన్గంగా నదిలో ఉగ్రవాదుల కదలికలను ఆర్మీ గుర్తించింది. ఇద్దరు, ముగ్గురు ఆగంతకులు ఆయుధాలు, మందు గుండు సామగ్రిని ఒక ట్యూబ్లో పెట్టి తాడు సాయంతో నది గుండా భారత్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా.. భారత జవాన్లు గుర్తించి వెంటనే అక్కడకు చేరుకున్నారు.
జవాన్లను చూసి ఆగంతకులు పారిపోయారు. ట్యూబ్ను తనిఖీ చేసిన భారత బలగాలు రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాయి. అందులో నాలుగు ఏకే 74 తుపాకులు, ఎనిమిది మ్యాగజీన్లు, 240 రౌండ్ల బుల్లెట్ ట్యూబ్లు ఉన్నట్లు బలగాలు గుర్తించాయి. ఘటనా స్థలంలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఘటనపై చినార్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ.. పాకిస్థాన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని దుయ్యబట్టారు. భారత్లో అల్లర్లు సృష్టించేందుకు దాయాది దేశం పదేపదే ప్రయత్నిస్తోందని, అయితే వారి కుట్రలను తాము భగ్నం చేస్తూనే ఉన్నామని తెలిపారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాక్ సరిహద్దు వెంబడి 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు లాంచ్ప్యాడ్ల వద్ద ఉన్నారని తెలిసినట్లు చెప్పారు. వారి ప్రయత్నాలను తాము సమర్థంగా తిప్పికొడుతున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.