Fire accident: ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌లో పేలుడు.. ముగ్గురి నేవీ సిబ్బంది మృతి!

మహారాష్ట్రలోని ముంబయి నావల్‌ డాక్‌ యార్డ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ నౌకలో పేలుడు సంభవించింది......

Published : 18 Jan 2022 22:05 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి నావల్‌ డాక్‌ యార్డ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, ఈ ఘటనలో 11మంది గాయపడగా.. వారందరినీ చికిత్స నిమిత్తం ముంబయి నౌకాదళ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. నౌకాదళ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు భారత నౌకాదళం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని