Jammu and Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త వ్యూహం..!
కశ్మీర్లో ఉగ్రవాదుల అరచాకం పెరిగిపోతోంది.. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు జల్లెడ పట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. ఇప్పుడు చిన్న ఆయుధాలతో పార్ట్టైమ్ ఉగ్రవాదులను దాడులకు పురిగొల్పుతున్నారు.
భారీగా పెరిగిన చిన్న ఆయుధాల వినియోగం..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కశ్మీర్లో ఉగ్రవాదుల అరాచకం పెరిగిపోతోంది.. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు జల్లెడ పట్టి వారిని మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. ఇప్పుడు చిన్న ఆయుధాలతో పార్ట్టైమ్ ముష్కరులను దాడులకు పురిగొల్పుతున్నారు. వీరు వలసకూలీలే లక్ష్యంగా దాడులు చేసి తప్పించుకొంటున్నారు. దీనికితోడు స్థానిక ఉగ్రవాదుల మనోస్థైర్యం పెంచేందుకు పాక్ సైన్యంలోని అత్యున్నత కమాండోలు నేరుగా శిక్షణ ఇవ్వడం లేదా కశ్మీర్లో దాడుల్లో పాల్గొనడం వంటివి చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.
ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిపై ఉగ్రవాదులు గురిపెడుతున్నారు. ఆదివారం మరో ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలు బలిగొన్నారు. దీంతో ఈ నెలలో అమాయకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 11కు చేరింది. కుల్గాంలోని వానిపోహ్ వద్ద కూలీలపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికేతరులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. అంతకు ముందు కశ్మీర్ లోయలోని శ్రీనగర్లో పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగించే అరబింద్ కుమార్ షా (బిహార్), పుల్వామాలో సిరాజ్ అహ్మద్ అనే కార్పెంటర్ (ఉత్తరప్రదేశ్)ను కాల్చి చంపారు. ఇప్పటి వరకు మరణించిన వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
పౌరులు, కశ్మీరీ మైనార్టీలపై ఉగ్రవాదులు గురిపెట్టారని గుర్తించిన వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై జమ్ము కశ్మీర్లో 900 మంది ఉగ్ర సానుభూతిపరులను అదుపులోకి తీసుకొన్నాయి. అంతేకాదు మొత్తం 9 ఎన్కౌంటర్లు చేపట్టి 13 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. గత 24 గంటల్లో శ్రీనగర్లో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఐజీ విజయ్కుమార్ తెలిపారు.
అతిపెద్ద ఎన్కౌంటర్ వెనక పాక్ కమాండోలు..
పదిహేనేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో పూంచ్ జిల్లాలోని పీర్పంజాల్ రేంజిలో ఎన్కౌంటర్ జరిగింది. అక్టోబర్ 10-11 రాత్రి డేరా వలీ గలీ ప్రాంతంలో మొదలైన ఈ ఎన్కౌంటర్ దాదాపు వారానికి పైగా కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జేసీవో అధికారులతో సహా 9 మంది సైనికులు మరణించారు. ఇక్కడ దాదాపు 9 కిలోమీటర్ల మేరకు దట్టంగా విస్తరించిన అడవిలో ఉగ్రవాదులు నక్కి దాడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల మృతదేహాలు దళాలకు కనిపించలేదు. ఇక్కడ తొలుత అక్టోబర్ 10వ తేదీన జరిగిన దాడిలో ఒక జేసీవోతో సహా ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఇదే ఆపరేషన్లో గురువారం మరో ఒక జేసీవో సహా ఇద్దరు సైనికులు అదృశ్యమయ్యారు. వీరి మృతదేహాలను రెండ్రోజుల తర్వాత దళాలు గుర్తించి అతికష్టం మీద స్వాధీనం చేసుకొన్నాయి.
దాదాపు ఎనిమిది రోజుల నుంచి ఉగ్రవాదులు అడవుల్లో నక్కి భద్రతా దళాలకు భారీగా నష్టాన్ని కలుగజేస్తున్న తీరుపై సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. వీరిలో పాకిస్థాన్ సైన్యంలో అత్యున్నత కమాండో దళాలకు చెందిన వారు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్కౌంటర్ ముగిసేవరకు దీనిని ధ్రువీకరించలేమని చెబుతున్నారు. ఇప్పటికీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఉగ్రవాదులు తప్పించుకోలేకుండా ఉచ్చులో ఇరికించినట్లు దళాలు చెబుతున్నాయి. ఇప్పటికే పారా కమాండోలతోపాటు హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. త్వరలోనే ఈ సుదీర్ఘ ఎన్కౌంటర్ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.
శీతాకాలం చొరబాట్లు మొదలు కావడంతో..
ఫిబ్రవరిలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో ఉగ్రవాదులను భారత్లోకి పంపించే సమయంలో పాక్ సైన్యం కాల్పులు జరపడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మూడు నెలల క్రితమే చొరబాటు యత్నాలకు విరామం ఇచ్చారు. కానీ, ఇప్పుడు శీతాకాలం సమీపిస్తుండటంతో ప్రకృతి సహకరిస్తుండటంతో పాక్ సైన్యం చొరబాట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్లో తిష్ఠవేసిన ఉగ్రమూకలు చొరబాట్లకు యత్నాలు మొదలుపెట్టాయి.
ఉగ్రవాదుల కంటే ఆయుధాలు ఎక్కువ..
పాక్ సైన్యం పంపించే ఉగ్రవాదుల సంఖ్య కంటే వారికి అందజేసే ఆయుధాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. అంటే స్థానిక ఉగ్రవాదుల వద్ద ఆయుధ కొరత ఉందని అర్థం. దీంతో వారు చిన్న ఆయుధాల వినియోగంపై మొగ్గారు. గత సెప్టెంబర్లో సైన్యం ముగ్గురు చొరబాటుదారుల్ని మట్టుబెట్టింది. వీరి వద్ద ఐదు ఏకే రైఫిల్స్, ఎనిమిది పిస్తోళ్లు, రెండు ఐఈడీలు, 69 గ్రనేడ్లు ఉన్నాయి. ఇది కశ్మీర్లో ఉన్న స్థానిక ఉగ్రవాదులకు పాక్ నుంచి ఆయుధాలు అందుతున్నాయనడానికి బలమైన ఆధారం.
పార్ట్టైమ్ లేదా హైబ్రీడ్ ఉగ్రవాదం..
భద్రతా దళాల నిఘాలో లేని వ్యక్తులు ఇటీవల ఎక్కువగా దాడులు చేసినట్లు తేలింది. వీరంతా కరుడుగట్టిన ఉగ్రవాదుల వలే దళాల నిఘా రాడార్లో ఉండరు. వీరు కేవలం అప్పటికప్పుడు ఒకట్రెండు దాడులు చేసి మళ్లీ సాధారణ జీవితంలోకి వెళ్లిపోతారు. గత రెండు వారాలుగా జరిగిన ఏడుగురు పౌరుల హత్యల్లో పిస్తోల్స్తో దాడి చేసిన నిందితుల్లో ఎక్కువ మంది సెక్యూరిటీ ఫోర్స్ల నిఘాలో లేరని తేలింది. వీరి శిక్షణ స్థానికంగానే జరుగుతోంది.
ముప్పుగా మారుతున్న చిన్న ఆయుధాలు..
హైబ్రీడ్ ఉగ్రవాదులు ఎక్కువగా చిన్న ఆయుధాలనే వాడుతున్నారు. కశ్మీర్లో ఈ ఒక్క ఏడాదే ఇప్పటి వరకు 97 పిస్తోళ్లను స్వాధీనం చేసుకోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. పాకిస్థాన్ కూడా డ్రోన్ల నుంచి జారవిడిచేందుకు పిస్తోళ్లు, గ్రనేడ్లు అనుకూలంగా ఉంటున్నాయి. కేవలం ప్రజల్లో పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసి భయానక వాతావరణం సృష్టించడమే దీని లక్ష్యం. ఇటీవల గమనిస్తే.. ఐఈడీ పేలుళ్ల వంటి భారీ దాడులను రెండేళ్లుగా ఉగ్రవాదులు పెద్దగా నిర్వహించడంలేదు. ఇది వారి వ్యూహాంలో మార్పునకు సంకేతం.
సాధారణంగా లక్ష్యంగా పెట్టుకొన్న వ్యక్తిని చంపడానికే పిస్తోళ్లు, గ్రనేడ్లను వినియోగిస్తారు. గతేడాది అక్టోబర్ 15 వరకు 203 పిస్తోళ్లను ,152 ఏకే రైఫిల్స్ను స్వాధీనం చేసుకొన్నట్లు సైన్యం తేలిపింది. ప్రతి ఎన్కౌంటర్లో దళాలు ఈ చిన్న ఆయుధాలను స్వాధీనం చేసుకొంటూనే ఉన్నాయి. ఒక్కో పిస్తోల్కు 10 రౌండ్ల తూటాల చొప్పున కేటాయిస్తున్నారు. అదే భారీ రైఫిల్కు 66 రౌండ్లు సగటున ఉగ్రవాదులు కేటాయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సీనియర్ ఉగ్రవాదులకు రైఫిల్స్ ఇస్తూ.. కొత్తగా ఉగ్రవాదంలోకి వచ్చిన వారికి మాత్రం పిస్తోళ్లు ఇస్తారని గతేడాది సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. భూమార్గంలో ఆయుధ రవాణాపై సైన్యం ఉక్కుపాదం మోపడంతో డ్రోన్ల సాయంతో పంజాబ్, జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో ఆయుధాలను జారవిడుస్తున్నారు. వీటిల్లో రైఫిళ్ల సంఖ్యతో దాదాపు సమానంగా పిస్తోళ్లు, గ్రనేడ్లు వంటివి ఉంటున్నాయి.
ఉగ్రకార్యకలాపాలకు కొత్త విధానం ..: కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్
‘‘అమాయకులను పిస్తోళ్లతో హత్యలు చేయడం ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడగా మారింది. ఈ ఏడాది హత్యకు గురైన పోలీసు అధికారులు మొత్తం నిరాయుధులే. వారి వద్ద దాడి సమయంలో ఎటువంటి ఆయుధాలు లేవు. వీరిలో అత్యధిక మందిని పిస్తోళ్లతోనే ఉగ్రవాదులు హత్య చేశారు. చిన్న ఆయుధాలతో దాడి సులభం కావడంతో పాకిస్థాన్ ఈ మార్గాన్ని ఎంచుకొంది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు