‘ఐదారేళ్ల తర్వాత ఒక్క తూటా పేల్లేదు’ 

దాదాపు ఐదారేళ్ల తర్వాత మొదటిసారి జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే తెలిపారు. ఈ మార్చి నెలలో ఒక్కటంటే ఒక్క తూటా కూడా అక్కడ పేలలేదని చెప్పారు.

Updated : 26 Mar 2021 04:39 IST

దిల్లీ: దాదాపు ఐదారేళ్ల తర్వాత మొదటిసారి జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే తెలిపారు. ఈ మార్చి నెలలో ఒక్కటంటే ఒక్క తూటా కూడా అక్కడ పేలలేదని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుదేశాలు పాటిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పాక్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అయితే పాకిస్థాన్ వైపు ఉగ్రవాదుల లాంచ్‌ ప్యాడ్స్‌ అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. భారత లక్ష్యం ఉగ్ర మూలాలను అంతమొందించడమేనని, పొరుగు దేశం ఉగ్రవాదానికి మద్దుతు ఇవ్వడం ఆపేస్తేనే టెర్రరిజాన్ని అరికట్టవచ్చన్నారు. పాక్‌లో నెలకొన్న అంతర్గత సమస్యల వల్లే కాల్పుల విరమణ ఒప్పందానికి ఆ దేశం ఒప్పుకుందనన్నారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడాలని గత నెలలో ఇరుదేశాల మిలటరీ కార్యకలాపాల డైరెక్టర్స్‌ జనరల్స్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఇదీ ‘‘గతాన్ని పాతిపెట్టే సమయం’’ అని వ్యాఖ్యానించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని