బీటింగ్ రీట్రీట్‌ రిహార్సల్స్‌..1000 డ్రోన్లతో వెలుగుల షో!

గణతంత్ర వేడుకల్లో భాగంగా ఏటా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌లో ఈసారి డ్రోన్లతో లేజర్‌ వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా .......

Published : 28 Jan 2022 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గణతంత్ర వేడుకల్లో భాగంగా ఏటా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌లో ఈసారి డ్రోన్లతో లేజర్‌ వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలోనే తొలిసారి 1000 డ్రోన్లతో ఈనెల 29న విజయ్‌చౌక్‌లో జరగనున్న బీటింగ్‌ రీట్రీట్‌కు రిహార్సల్స్‌ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా రాష్ట్రపతి భవన్‌ నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆకాశంలోకి రివ్వున ఎగిరిన ఈ డ్రోన్లు లేజర్‌ వెలుగులను విరజిమ్ముతూ కనులవిందు చేసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఐఐటీ దిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్‌ డైనమిక్స్‌ అనే అంకుర సంస్థ దీన్ని రూపొందించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శనను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రదర్శన నిర్వహించగా.. తొలిసారి భారత్‌ కూడా ఆ జాబితాలో చేరనుంది. ఈ వీడియో చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని