Zika virus: ఒక్క కాన్పూర్‌లోనే 89 ‘జికా’ కేసులు.. సీఎం అత్యవసర సమావేశం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శనివారం వరకు 79 కేసులు వెలుగుచూడగా.. తాజాగా ఆదివారం మరో 10 మందికి పాజిటివ్‌గా తేలింది.....

Published : 07 Nov 2021 20:29 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శనివారం వరకు 79 కేసులు వెలుగుచూడగా.. తాజాగా ఆదివారం మరో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 89కి చేరింది. అయితే కాన్పుర్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జికా కేసులు పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శానిటైజేషన్‌ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంటింటికి తిరిగి శానిటైజేషన్‌ చేయాలన్నారు. ఫాగింగ్‌ డ్రైవ్‌ను చేపట్టాలని సూచించారు.

కాన్పూర్‌లో అక్టోబరు 24న తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా.. జికా బారినపడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం.. ఆ అధికారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టి వారి రక్త నమూనాలను పరీక్షించారు. ఐఏఎఫ్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా పరీక్షలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని