బెడ్కు అతుక్కుపోతున్నారా? జాగ్రత్త సుమీ!
ఖాళీ సమయం దొరికితే చాలు బెడ్పై సేదతీరుతాం. అప్పుడప్పుడు మంచంపైనే కూర్చుని తింటాం. నిద్రించే సమయంలో బెడ్పై పడుకుని దొర్లుతూ ఉంటారు కొందరు. దిండును హత్తుకుని పడుకునేవారు ఇంకొందరు. బెడ్ షీట్ను చుట్టుకుని కలల ప్రపంచంలోకి జారుకునే వారు మరికొందరు. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: ఖాళీ సమయం దొరికితే చాలు బెడ్పై సేదతీరుతాం. అప్పుడప్పుడు మంచంపైనే కూర్చుని తింటాం. నిద్రించే సమయంలో బెడ్పై పడుకుని దొర్లుతూ ఉంటారు కొందరు. దిండును హత్తుకుని పడుకునేవారు ఇంకొందరు. బెడ్ షీట్ను చుట్టుకుని కలల ప్రపంచంలోకి జారుకునే వారు మరికొందరు. అయితే.. బెడ్పై ఎక్కువసేపు ఉండటం మంచిదికాదని చెబుతున్నారు బ్రిటన్కు చెందిన ఓ సూక్ష్మజీవుల నిపుణుడు. బెడ్పై వేలకొద్దీ బ్యాక్టీరియా దాగి ఉంటుందని అధ్యయనంలో తేలిందట.
మనం ఊహించినంత నీట్గా 'బెడ్' ఉండదనే విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదని ఓ అధ్యయనంలో తేల్చారు లండన్కు చెందిన ఓ శాస్త్రవేత్త. చెమట, ఉమ్ము, డాండ్రఫ్, మృత చర్మ కణాలు, ఆహార పదార్థాలు మొదలైనవి బెడ్పై ప్రమాదకరజీవుల్లా మారుతాయని పేర్కొంటున్నారు. వీటి కారణంగా బెడ్పై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వ్యాప్తిచెందుతుందని వివరించారు. బెడ్షీట్లపై వేలకొద్దీ బ్యాక్టీరియా దాగి ఉంటుందని.. ఓ ఆసుపత్రిలోని బెడ్షీట్లపై నిపుణులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా బెడ్షీట్లపై అధికంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. స్టాఫిలోకొక్కస్ ప్రమాదకర బ్యాక్టీరియా కాదు. కానీ.. చర్మంపై గాయాలైన చోట నుంచి ఇది మానవ శరీరంలోకి ప్రవేశిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. స్టాఫిలోకొక్కస్ ఆరియస్- స్టాఫిలోకొక్కస్ బ్యాక్టీరియా జాతిలో ఇది చాలా ప్రమాదకారి. దీని వల్ల చర్మ వ్యాధులు, న్యుమోనియా, మెటిమలు తీవ్రమవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ రకం బ్యాక్టీరియా కూడా ఆసుపత్రి బెడ్లపైనే ఎక్కువగా ఉంటుంది. దీన్ని గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అని కూడా ఉంటారు. ఈ బ్యాక్టీరియా వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు, న్యుమోనియా, డయేరియా మొదలైన వ్యాధులు సంక్రమిస్తాయి.
నిద్రిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుంచి సాధారణంగా 500 మిలియన్ల చర్మ కణాలు బెడ్పై పడతాయి. నల్లులు వీటిని ఆహారంగా సేవిస్తాయి. ఈ పురుగులు వదిలే వ్యర్థాల ద్వారా అలర్జీ, ఆస్తమా వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. బెడ్పై ఉండే ఈ పురుగుల ద్వారా చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఒత్తిడి, నిద్రలేమి, అలర్జీ వంటి మానసిక సమస్యలకు ఇవి కారణం అవుతాయి. బట్టలు, బ్యాగుల ద్వారా నల్లులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంది. పరిశుభ్రంగా లేని వస్తువుల ద్వారా సూక్ష్మజీవులు బెడ్పైకి చేరతాయి. బట్టలు, టవల్స్, కిచెన్లోని వస్తువులు, పెంపుడు జంతువుల ద్వారా సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. బాత్రూమ్, కిచెన్ టవల్స్ ద్వారా ఎస్ ఆరియస్, ఈ కొలి బ్యాక్టీరియాలు ఎక్కువగా వ్యాపిస్తాయి.
బెడ్ను ఇలా శుభ్రంగా ఉంచుకోవచ్చు..
* బట్టలు, బెడ్షీట్లు రెగ్యులర్గా, సరిగ్గా ఉతకడం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను అంతం చేయొచ్చు. రోజూ బెట్షీట్లను ఉతకలేం కాబట్టి వాటిని ప్రతి ఉదయం గాలికి ఆరబెట్టాలి.
* కనీసం రెండు వారాలకోసారైనా బెడ్షీట్లు శుభ్రం చేసుకోవాలి. బెడ్ పరిసరాలను వ్యాక్యూమ్ క్లీనింగ్ ద్వారా రోజూ శుభ్రపరుచుకోవడం మంచిది.
* అర్ధ నగ్నంగా నిద్రించేవారు, ఎక్కువ సమయం బెడ్పైనే గడిపేవారు, ఎక్కువ చెమట వచ్చేవారు వారానికోసారి బెడ్షీట్లను తప్పనిసరిగా ఉతకాలి. రెండు, మూడు రోజులకు దిండు కవర్లను మార్చాలి.
* పడుకునేముందు స్నానం చేయడం, చెమటలు పడుతుండగా బెడ్పై కునుకు తీయడం, బెడ్పై కూర్చుని లోషన్స్, ఆయిల్ మొదలైనవి అప్లై చేయడం మంచిదికాదు.
* పెంపుడు జంతువులను బెడ్లకు దూరంగా ఉంచాలి.
* బెడ్పై ఆహారం, పానీయాలు సేవించకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే