నేను పుట్టి ఉండేదాన్ని కాదు! తల్లికి సలహా ఇవ్వని డాక్టర్పై కుమార్తె దావా
ఇంగ్లాండ్కి చెందిన 20 ఏళ్ల ఈవ్ టూంబెస్ ఓ షో జంపర్. కానీ, పుట్టుకతోనే ‘స్పైనా బిఫిడా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవారిలో వెన్నెముక సరిగా అభివృద్ధి చెందదు. దీంతో శరీర కదలికలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంతటి వ్యాధితో బాధపడుతూ కూడా ఈవ్ ఎంతోకష్టపడి జీవితంలో
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్కి చెందిన 20 ఏళ్ల ఈవ్ టూంబెస్ ఓ షో జంపర్(గుర్రపు స్వారీ). కానీ, పుట్టుకతోనే ‘స్పైనా బిఫిడా’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవారిలో వెన్నెముక సరిగా అభివృద్ధి చెందదు. దీంతో శరీర కదలికలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంతటి వ్యాధితో బాధపడుతూ కూడా ఈవ్ ఎంతోకష్టపడి జీవితంలో మంచి స్థాయికి ఎదిగింది. 2018లో ‘ఇన్స్పిరేషన్ యంగ్ పర్సన్’అవార్డును సైతం గెలుచుకుంది. అయినా.. అందరిలా సాధారణ జీవితం గడపలేకపోతున్నానే బాధ ఆమెను నిత్యం వెంటాడుతూ వస్తోంది. దీనికి కారణాన్ని ఆన్వేషించిన ఆమె తాజాగా తన తల్లికి వైద్యసూచనలు ఇచ్చిన వైద్యుడిపై దావా వేసింది. సూచనలు ఇవ్వడంలో వైద్యుడు విఫలమయ్యాడని, తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోర్టును కోరుతోంది.
‘‘గర్భం దాల్చినప్పుడు బిడ్డకు స్పైనా బిఫిడా రాకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరముంది. డాక్టర్ ఫిలిప్ మిషెల్ ఈ విషయాన్ని నా తల్లికి చెప్పలేదు. ఆ విషయం చెప్పి ఉంటే.. తగిన జాగ్రత్తలు పాటించేవారు. నేను పుట్టి ఉండేదాన్ని కాదు’’అని ఈవ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఫోలిక్ యాసిడ్ కోర్సు అవసరం లేదని, మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ ఫిలిప్ తనకు చెప్పినట్లు ఈవ్ తల్లి కోర్టుకు వివరించింది. అయితే, డాక్టర్ తరఫు న్యాయవాది మాత్రం.. ఈవ్ తల్లిదండ్రులకు ఫోలిక్ యాసిడ్ చికిత్స గురించి ముందుగానే చెప్పినట్లు వాదించారు. ఇక ఈవ్ విషయానికొస్తే.. తన వయసుతోపాటు వ్యాధి కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో తను వీల్ఛైర్కే పరిమితమయ్యే ప్రమాదముందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరి కోర్టు ఏ విధంగా తీర్పునిస్తుందో వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?