వెబ్సిరీస్ చూసి.. ప్రాణాల మీదకు తెచ్చుకొని
ఇంటికి తాళం వేసి ఉండటంతో ఈ రోజు ఉదయం ఓ టీనేజర్ కిటికిలోకి దూకి బయటకువద్దామకుని అందులో ఇరుక్కుపోయింది
సినిమా సన్నివేశాన్ని తలిపించేలా అమెరికాలో ఓ ఘటన
ఇంటర్నెట్ డెస్క్: మీ ఇంట్లో వాళ్లు తాళం వేసి బయటికి వెళ్లారు.. ఆ సమయంలో మీరొక్కరే ఇంట్లో ఉన్నారు.. వాళ్లుతిరిగి ఇంటికి వచ్చి తాళం తిద్దామంటే తాళంచెవి కనిపించలేదు. ఇంట్లో మీరు.. బయట వాళ్లు.. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. ఇక తలుపు తీయడానికి పండే తంటాలు అన్నిఇన్ని కావు కదూ.. ఇప్పుడా తలుపు తెరవాలంటే ప్రధానంగా మన మెదడులోకి వచ్చే రెండు ఆలోచనలు..ఒకటి స్పేర్ కీ.. లేదా కొత్తతాళం చెవి తయారు చేయించి తలుపు తీయాలా అనే కదూ.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా... సరిగ్గా ఇదే ఘటన అమెరికాలోని నెవడా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ అమ్మాయి(18) తన ఇంట్లో ఇదే తరహాలో ఇరుక్కుపోయింది. మరి ఎలా బయటపడాలి అని అనుకుంటుండగా.. రోజు తాను చూసే ఓ టీవీ సిరీస్లో సన్నివేశాన్ని గుర్తుచేసుకుంది. అంతే వెంటనే చిమ్ని(కిటికి) నుంచి బయటికి వచ్చేద్దామని అందులోకి దూరింది. కానీ బయటకు వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక వెంటనే ఆమెను కాపాడాలంటూబయట ఉన్న వారు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్నంతా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వారి ఫేస్బుక్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది.‘‘ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఈ రోజు ఉదయం ఓ టీనేజర్ కిటికిలోకి దూకి బయటకువద్దామనుకొని అందులో ఇరుక్కుపోయింది. అయితే ఆమెని రక్షించేందుకు ప్రత్యేక రోప్ సిస్టం ఉపయోగించాం. అరగంట పాటు కృషి చేసి అమ్మాయిని బయటికి తీసుకొచ్చాం. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అదృష్టవశాత్తూ ఆమెకేమీ గాయాలవ్వలేదు’’. కాగా ఆమె కిటికిలో ఇరుక్కుపోవడం.. వెంటనే రెస్కూటీం కాపాడం.. అంతా ఓ చిత్రంలోని సన్నివేశాన్ని తలపించింది. కామెంట్ సెక్షన్లలో నెటజన్లు విభిన్నంగా స్పందించారు. ‘‘ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం కన్నా తాళం వేసిన ఇంట్లో ఉండటం నయమని, ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చెయ్యొద్దు ’’ అని హితవు పలికారు. టీనేజర్ని కాపాడినందుకు గానూ వారి శ్రమ ప్రశంసనీయం.. ‘‘మీ వల్ల ఓ అమ్మాయి సురక్షితంగా బయటపడింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోతాం’’ అని కామెంట్లు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు