Mask: మాస్కు ధరించలేదని మహిళపై ఖాకీల దాడి
కొవిడ్ నిబంధనల పేరుతో మధ్యప్రదేశ్ పోలీసులు రెచ్చిపోయారు. మాస్కు ధరించలేదనే కారణంతో ఓ మహిళపై ఆమె కుమార్తె ముందే పోలీసులు అమానుషంగా దాడికి ..
రోడ్డుపైనే ఈడ్చుకుంటూ కొట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు
భోపాల్: కొవిడ్ నిబంధనల పేరుతో మధ్యప్రదేశ్ పోలీసులు రెచ్చిపోయారు. మాస్కు ధరించలేదనే కారణంతో ఓ మహిళపై ఆమె కుమార్తె ముందే పోలీసులు అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను పోలీసులు నడిరోడ్డుపైనే ఈడ్చుకుంటూ కొడుతూ, కాలితో తంతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఓ మహిళ, ఆమె కుమార్తె నిత్యావసర సరకులు కొనేందుకు బయటకు వచ్చారు. కొవిడ్ నిబంధనల పేరుతో మాస్కు ధరించలేదంటూ ఆ మహిళను ఇద్దరు పోలీసులు కొట్టారు. వారి నుంచి విడిపించుకొనేందుకు ఆమె ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆమె పలుమార్లు రోడ్డుపై కింద పడిపోయింది. ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించేందుకు ఓ మహిళా పోలీసు సైతం ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. తల్లిని వారి నుంచి విడిపించేందుకు కుమార్తె చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆర్తనాదాలు చేస్తున్న ఆ మహిళ జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసులు హింసకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి. కొవిడ్ నిబంధనల పేరుతో ఇలాంటి అమానుషాలకు పాల్పడటం మధ్యప్రదేశ్ పోలీసులకు కొత్తేమీ కాదు. మాస్కు ధరించలేదనే కారణంతో ఇండోర్లో ఓ వ్యక్తిపై పోలీసులు గత నెల ఇదే విధంగా హింసకు దిగారు. కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో దేశవ్యాప్తంగా గత నెల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులపై చాలా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట