Karnataka: రైల్వే పోలీసుల అప్రమత్తత.. మహిళకు తృటిలో తప్పిన ప్రమాదం

రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శివమెుగ్గ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ..

Updated : 11 Nov 2021 01:46 IST

శివమెుగ్గ: రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శివమెుగ్గ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ.. కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించింది. ఈ క్రమంలో కాలు జారి ఒక్కసారిగా ఫ్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన రైల్వే పోలీసులు వేగంగా స్పందించారు. బాధిత మహిళ పట్టాల వైపునకు జారిపోకుండా రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బంధువులకు వీడ్కోలు పలికేందుకు స్టేషన్‌కు వచ్చి ఆ మహిళ ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని