పామును చూసి భర్త పరుగులు.. ధైర్యంగా పట్టుకున్న భార్య

కింగ్‌ కోబ్రాను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన సస్మతా గోచెట్‌ అనే మహిళ విషపూరిత...

Published : 07 Jun 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కింగ్‌ కోబ్రాను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన సస్మతా గోచెట్‌ అనే మహిళ విషపూరిత కోబ్రాను ధైర్యంగా పట్టుకున్నారు. సస్మతా ఇంట్లోకి శనివారం రాత్రి సమయంలో కోబ్రా ప్రవేశించింది. ఇది గమనించిన సస్మత భర్త భయంతో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. కానీ సస్మతా మాత్రం పామును పట్టుకొని అటవీ అధికారుల సహకారంతో అడవిలో వదిలిపెట్టారు. పామును పట్టుకోవడం ఇదే తొలిసారని సస్మతా అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని