కాలక్షేపానికి లాటరీ టికెట్ కొని.. ₹7 కోట్లు గెలుచుకుంది!
అదృష్టం ఎప్పుడు.. ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో.. రాత్రికిరాత్రి ఎవరిని కోటీశ్వరులుగా మారుస్తుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి లాటరీల రూపంలోనూ తలుపుతడుతుంటుంది......
ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో.. రాత్రికిరాత్రి ఎవరిని కోటీశ్వరులుగా మారుస్తుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి లాటరీల రూపంలోనూ తలుపుతడుతుంటుంది. అనుకోకుండా కలిసొచ్చిన ఈ అదృష్టం వల్ల కూటికి లేని వాళ్లు కూడా కోటీశ్వరులు అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అమెరికాలోని మిస్సోరిలోని కానాస్ సీటీకి చెందిన 51 ఏళ్ల ఏంజెలా కారావెల్లా తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో కాలక్షేపంగా లాటరీ టిక్కెట్ కొని ఏకంగా ₹ 7కోట్లు గెలుచుకుంది. "నా విమానం ఊహించని విధంగా రద్దు అయ్యింది. తరువాత ఏదో విచిత్రమైన విషయం జరగబోతోందని నాకు అనిపించింది. ఆ సమయంలో కాలక్షేపానికి కొన్ని స్క్రాచ్-ఆఫ్ టిక్కెట్లు కొన్నా. అవే నాకు కోట్లు తెచ్చిపెట్టాయి!" అని ఏంజెలా తన ఆనందాన్ని పంచుకుంది. కారావెల్లా టాంపాకు తూర్పున ఉన్న బ్రాండన్లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్ లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేయగా.. ఈ టిక్కెట్ విక్రయించినందుకు స్టోరుకు 2వేల డాలర్లు దక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.