ఇదీ.. జనవరి 1 వెనకున్న కథ!
ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు ప్రజలు మార్చి/ఏప్రిల్ నెలలో వచ్చే ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తారు. అలాగే నేపాల్లో దీపావళి వేడుకల్లో నాలుగో రోజు అయిన ‘మా పూజ’ను నేపాలీ కాలెండర్ ప్రకారం నూతన
ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు ప్రజలు మార్చి/ఏప్రిల్ నెలలో వచ్చే ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తారు. అలాగే నేపాల్లో దీపావళి వేడుకల్లో నాలుగో రోజు అయిన ‘మా పూజ’ను నేపాలీ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం తొలిరోజుగా జరుపుకొంటారు. చైనా, కొరియా దేశాలు ఫిబ్రవరిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటాయి. ఇలా చాలా దేశాలు వారి దేశీయ సంప్రదాయం ప్రకారం ఇతర నెలల్లో, తేదీల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాయి. అయినా, అన్ని దేశాల్లో జనవరి 1వ తేదీనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఎందుకలా? ఈ రోజునే నూతన సంవత్సర వేడుకలు ఎందుకు? తెలుసుకుందాం పదండి..
మొదట్లో జనవరి నెలే లేదు..
నూతన సంవత్సరం జరుపుకోవడం కొత్తేమీ కాదు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలు అంటే.. 4వేల సంవత్సరాల కిందటి నుంచే నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారు. నిజానికి ప్రపంచమంతా ఏటా మార్చి నెలలో వసంత కాలం ప్రారంభమైన నాటి నుంచే కొత్త ఏడాదిగా పరిగణించేవారు. అయితే, అదే సమయంలో రోమ్ సామ్రాజ్యం పది నెలలతో కూడిన రోమ్ క్యాలెండర్ను రూపొందించింది. ఈ క్యాలెండర్లో తొలి నెల మార్చిగా ఉండటంతో మార్చి1ని నూతన సంవత్సరంగా జరుపుకోవడం మొదలుపెట్టారు.
మార్చికి ముందు వచ్చి చేరిన జనవరి.. ఫిబ్రవరి
అయితే క్రీస్తుపూర్వం 700 కాలంలో రోమ్ రెండో చక్రవర్తి నుమా పొంటిలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను అప్పటికే ఉన్న రోమ్ క్యాలెండర్కు జతచేసి 12 నెలలున్న క్యాలెండర్ను రూపొందించారు. తన సామ్రాజ్యంలో నియమితులైన ప్రజాప్రతినిధులు, అధికారుల పదవీకాలాలను జనవరి 1 నుంచి లెక్కగట్టేవారు. జనవరి 1ని కేవలం అధికారుల పదవీ కాలపరిమితిని లెక్కించడానికి మాత్రమే పరిగణనలోనికి తీసుకునేవారు. నూతన సంవత్సర వేడుకల్ని మాత్రం మార్చి ఒకటినే నిర్వహించేవారు.
జనవరి 1న నూతన సంవత్సరం
కాల క్రమంలో రోమ్ ప్రజలు జనవరి 1ని నూతన సంవత్సరం తొలిరోజుగా గుర్తించడం మొదలుపెట్టారు. తొలిసారి క్రీ.పూ 153లో నూతన సంవత్సరం వేడుకలు జనవరి 1న జరిగాయి. అయినా నూతన ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్నతోపాటు.. సూర్యచంద్రుల గమనంతో.. అప్పటి క్యాలెండర్ తేదీలు సరితూగకపోవడంతో వాటి లెక్కలు సరిచేసి క్రీ.పూ 46లో జూలియస్ సీజర్.. జూలియన్ క్యాలెండర్ను అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి అనే పేరు జానస్ అనే రోమ్ దేవుడి పేరు మీదుగా వచ్చింది. అందుకే జనవరి 1వ తేదీని నూతన సంవత్సరం తొలి రోజుగా జూలియస్ అధికారికంగా ప్రకటించారు.
డిసెంబర్ 25కు మార్పు
క్రీస్తుశకం వచ్చాక యూరప్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. యూరప్లో క్రైస్తవ ప్రభావం పెరగడంతో 567లో అప్పటి దేశ పాలకులు జనవరి 1ని నూతన సంవత్సరంగా తొలగించి క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25నుంచి కొత్త ఏడాది ప్రారంభమయ్యేలా మార్పులు చేశారు.
మళ్లీ జనవరి 1కి..
జూలియన్ క్యాలెండర్లోనూ పలు లోపాలను గుర్తించిన పోప్ గ్రెగొరీ-XIII.. వాటికి స్వల్ప మార్పులు చేస్తూ 1582లో గ్రెగొరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. ఆయన రూపొందించిన క్యాలెండర్ ఆమోదయోగ్యంగా ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ దానికి అలవాటుపడి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. అయితే, బ్రిటన్ మొదట్లో గ్రెగొరియన్ క్యాలెండర్ను అనుసరించడానికి ఇష్టపడలేదు. అందుకే జనవరి 1 కాకుండా.. మార్చి 1న కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేది. కాలక్రమంలో ప్రపంచ దేశాలు, బ్రిటన్ మధ్య తేదీల్లో తేడాలు రావడం, వాణిజ్యపరంగా ఇబ్బందులు మొదలు కావడంతో 1752లో బ్రిటన్ సామ్రాజ్యం కూడా గ్రెగొరియన్ క్యాలెండర్ను అమలు చేసి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొంది. ఇదీ జనవరి 1 వెనకున్న కథ..!
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హీరో విశాల్ కోరారు. ‘రత్నం’ ప్రెస్మీట్లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?