జనాలతో ఉండలేకపోతున్నా.. జైల్లో పెట్టండి
కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్డౌన్ విధించారు. ఆ సమయంలో అందరూ నాలుగు గోడల మధ్యే బంధీలయ్యారు. ఆ సమయాన్ని కొందరు సద్వినియోగం చేసుకొంటే, మరికొందరు ఖాళీగా ఉంటూ గడిపేశారు.
లండన్: కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్డౌన్ విధించారు. ఆ సమయంలో అందరూ నాలుగు గోడల మధ్యే బంధీలయ్యారు. ఆ సమయాన్ని కొందరు సద్వినియోగం చేసుకొంటే, మరికొందరు ఖాళీగా ఉంటూ గడిపేశారు. ఎప్పుడూ ఉరుకులు పరుగులతో జీవించే చాలా మంది ఇళ్లలో ఉండలేకపోయారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన ఘటనే ఇది. కానీ ఇతడు అందరిలా కాదు. పరారీలో ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ఉండలేక నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన యూకేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న ఓ వ్యక్తి లాక్డౌన్ సమయంలో నాలుగు గోడల మధ్య ఎక్కువ సమయం ఉండటంతో పాటు, తాను ప్రస్తుతం జీవిస్తున్న మనుషులతో ఉండటం కంటే జైల్లోనే ప్రశాంతంగా ఉంటుందని భావించి యూకేలోని ససెక్స్ పోలీసులకు లొంగిపోయాడు. తనను జైల్లోనే ఉంచాలని కోరుతూ ఆ వ్యక్తి బుధవారం బర్గస్హిల్ పోలీసుస్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ విషయాన్ని డారెన్ టేలర్ అనే పోలీసు అధికారి ట్విట్టర్లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతడు లొంగిపోయిన అనంతరం జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సమయంలో అతడు ఒంటరిగా తనతో తాను గడపటం ఎంతో ముఖ్యమని డారెన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ