జనాలతో ఉండలేకపోతున్నా.. జైల్లో పెట్టండి

కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో అందరూ నాలుగు గోడల మధ్యే బంధీలయ్యారు. ఆ సమయాన్ని కొందరు సద్వినియోగం చేసుకొంటే, మరికొందరు ఖాళీగా ఉంటూ గడిపేశారు.

Published : 20 Feb 2021 00:55 IST

లండన్‌: కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో అందరూ నాలుగు గోడల మధ్యే బంధీలయ్యారు. ఆ సమయాన్ని కొందరు సద్వినియోగం చేసుకొంటే, మరికొందరు ఖాళీగా ఉంటూ గడిపేశారు. ఎప్పుడూ ఉరుకులు పరుగులతో జీవించే చాలా మంది ఇళ్లలో ఉండలేకపోయారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన ఘటనే ఇది. కానీ ఇతడు అందరిలా కాదు. పరారీలో ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ఉండలేక నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన యూకేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న ఓ వ్యక్తి లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు గోడల మధ్య ఎక్కువ సమయం ఉండటంతో పాటు, తాను ప్రస్తుతం జీవిస్తున్న మనుషులతో ఉండటం కంటే జైల్లోనే ప్రశాంతంగా ఉంటుందని భావించి యూకేలోని ససెక్స్‌ పోలీసులకు లొంగిపోయాడు. తనను జైల్లోనే ఉంచాలని కోరుతూ ఆ వ్యక్తి బుధవారం బర్గస్‌హిల్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ విషయాన్ని డారెన్‌ టేలర్‌ అనే పోలీసు అధికారి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతడు లొంగిపోయిన అనంతరం జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సమయంలో అతడు ఒంటరిగా తనతో తాను గడపటం ఎంతో ముఖ్యమని డారెన్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని