Vundavalli: పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళన.. ఉండవల్లి ఏమన్నారంటే..

రాష్ట్రంలో పీఆర్సీ అంశం.. ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. ఇప్పటివరకు

Updated : 24 Jan 2022 15:29 IST

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో పీఆర్సీ అంశం.. ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. ఇప్పటివరకు జీతాలు పెంచాలని సమ్మెలు చూశామని.. కానీ పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె నోటీసుకు సిద్ధమవడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. పాత జీతాలే కావాలంటూ సమ్మె చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా పరిస్థితులు, ఆర్థిక దుస్థితి దృష్ట్యా సమ్మె ఆపాలని ఉద్యోగులను ఉండవల్లి కోరారు. ప్రభుత్వం, ఉద్యోగులు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని