భలే స్టార్టప్: పెరట్లో ఇళ్లు కట్టి అద్దెకిస్తారట!
పెద్ద పెద్ద పట్టణాల్లో పేదలకు అద్దెకు ఇల్లు దొరకడం మహా కష్టం. ఎక్కడ చూసినా అద్దెలు వేలల్లో ఉంటాయి. ఈ సమస్య మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లోనూ ఉండేదే. అమెరికాలోని....
(ఫొటో: ఓబీవై హోమ్స్ వెబ్సైట్)
ఇంటర్నెట్ డెస్క్: పెద్ద పెద్ద పట్టణాల్లో పేదలకు అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎక్కడ చూసినా అద్దెలు వేలల్లో ఉంటాయి. ఈ సమస్య మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఉండేదే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోనూ ఈ సమస్య మరీ ఎక్కువ. దీంతో ఈ విషయంలో పేదలకు మంచి చేయాలనే సంకల్పంతో ‘అవర్ బ్యాక్యార్డ్ (ఓబీవై)’ అనే స్టార్టప్ సంస్థ చక్కటి ఆలోచనతో ముందుకొచ్చింది. అక్కడి పేదలకు అద్దెకు ఇవ్వడం కోసం తక్కువ స్థలంలో మంచి ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది.
శాన్ఫ్రాన్సిస్కోలోని ఈస్ట్ బే ప్రాంతంలో పేదలకు అద్దెకు ఇల్లు దొరకడం కష్టమైపోతోంది. ఇదివరకే నిర్మించి ఉన్న ఇళ్లు పెద్దవిగా.. ఇంటి వెనుక ఎక్కువ స్థలం ఉంటోంది. ఇలాంటి ఇళ్లకు అద్దె భారీగానే ఉంటోంది. దీంతో ఓబీవై అనే స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలోని ఇళ్ల వెనుక ఉండే పెరడును ఈ సంస్థ 99 ఏళ్లు లీజుకు తీసుకొని.. అందులో కలపతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు 500 డాలర్ల వరకు ఆదాయం పొందుతున్న వారికి మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే ఇంటిని అద్దెకిస్తామని ఆ సంస్థ చెబుతోంది. రెండు పడకల గదులతో పాటు వంటగది, బాత్రూమ్, లాండ్రీ, లివింగ్ రూమ్ అన్ని సదుపాయాలూ ఉండేలా చూస్తున్నారు. ఇంటి రూఫ్టాప్పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తుండటంతో విద్యుత్ బిల్లుల మోతా తప్పుతుంది. పేదలకు తక్కువ అద్దెలో ఇళ్లు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ‘ఓబీవై’ సంస్థ చేసిన ఆలోచన నిజంగా సూపర్ కదా!
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు