Viral videos: కుల్లడ్ పిజ్జా.. కేరాఫ్ సూరత్
పిజ్జా.. నోరూరించే ఈ ఇటాలియన్ డిష్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. గుండ్రటి పిజ్జా బేస్పై సాస్ అప్లై చేసి, వివిధ కూరగాయలు లేదా మాంసం ముక్కలతో టాపింగ్ చేసి, దానిపై ఛీజ్ పరిచి చేస్తుంటారు. ఇది సాధారణంగా అందరికి తెలిసిన రకం పిజ్జా. కానీ.. కుల్లడ్ పిజ్జా గురించి విన్నారా?...
ఆకట్టుకుంటున్న తయారీ విధానం.. వైరల్గా మారిన వీడియో
ఇంటర్నెట్ డెస్క్: పిజ్జా.. నోరూరించే ఈ ఇటాలియన్ డిష్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. గుండ్రటి పిజ్జా బేస్పై సాస్ అప్లై చేసి, వివిధ కూరగాయలు లేదా మాంసం ముక్కలతో టాపింగ్ చేసి, దానిపై ఛీజ్ పరిచి చేస్తుంటారు. ఇది సాధారణంగా అందరికి తెలిసిన రకం పిజ్జా. కానీ.. కుల్లడ్ పిజ్జా గురించి విన్నారా? పేరే వింతగా ఉంది కదూ. అవును.. తయారీ విధానం కూడా అంతే. గుజరాత్లోని సూరత్లో ఓ దుకాణదారుడు.. పిజ్జా బేస్ లేకుండానే కుల్లడ్(మట్టి గిన్నె)లో దీన్ని తయారు చేస్తూ, ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. దీని తయారీ కోసం.. మొదటగా ఉడికించిన మొక్కజొన్న పొత్తులు, తరిగిన టమాటాలు, పన్నీర్ ముక్కలు, కెచప్, మయోనీస్, వివిధ రకాల సాస్లతో మిశ్రమాన్ని తయారు చేసి.. చిన్న మట్టి కుండలో నింపుతున్నాడు. అనంతరం.. ఆ మిశ్రమంపై మళ్లీ సాస్లు, ఉప్పు, చాట్ మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెద్ద ఎత్తున ఛీజ్ వేస్తున్నాడు. గిన్నె పూర్తిగా నిండాక, మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి.. వేడివేడిగా అందిస్తున్నాడు. ఆకట్టుకునేలా ఉన్న ఈ తయారీ వీడియోను ‘ఆమ్చీ ముంబయి’ అనే ఛానల్ యూట్యూబ్లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్గా మారింది. ఇప్పటివరకు దాదాపు 23 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లూ ఈ వీడియోపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘ఈ వీడియో గనుక చూస్తే ఇటలీకి చెందిన మా బామ్మ మాపై యుద్ధం ప్రకటిస్తుంది’ అని ఒకరు, ‘అతని ప్రయత్నాన్ని అభినందించండి. నేను భారతీయుడిగా గర్వపడుతున్నా. మేం ఎప్పుడూ వినూత్న పరిష్కారాలు కనుగొంటాం’ అని మరొకరు.. ‘ఫస్ట్ టైం బేస్ లేని పిజ్జా చూస్తున్నా’.. ‘ఇది పిజ్జా కాదు.. ‘పాట్’జా’.. ‘అద్భుతమైన వంటకం, సృజనాత్మకంగా ఉంది. తినేందుకు ఎదురుచూస్తున్నా..’ ఇలా పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. దీని తయారీ వీడియోను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434