ఇడ్లీ, దోసె.. ఏదైనా ఒక్క రూపాయే!
సాటి మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, మిద్దెలూ అక్కర్లేదు. మంచి మనసుంటే చాలని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ బామ్మ. తాటి గుడిసెలో రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది. డబ్బులో దొరకని.........
పేదల ఆకలి తీరుస్తున్న బామ్మ
ఇంటర్నెట్డెస్క్: సాటి మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, మిద్దెలూ అక్కర్లేదు. మంచి మనసుంటే చాలని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ బామ్మ. తాటి గుడిసెలో రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది. డబ్బులో దొరకని ఆత్మసంతృప్తి ఒకరి కడుపు నింపడంలో దొరుకుతోందని చెబుతోంది ఆ బామ్మ.
తమిళనాడులోని తిరువరూర్- నారమంగళం గ్రామానికి చెందిన కమల పట్టి (85)కి 50 ఏళ్లుగా హోటలే జీవనాధారం. హోటల్ అంటే మన నగరాల్లో నడిపినట్టుగా రంగురంగుల లైట్లు, టేబుళ్లు, డిజైన్లతో కూడిన ప్లేట్లు ఉండవు. పాండయచూర్ నదీ తీరాన.. ఓ చిన్ని తాటాకు గుడిసె ఆమె హోటల్. వెడల్పాటి పచ్చని ఆకులే ఆ హోటల్లో ప్లేట్లు. పెద్ద బండరాళ్లే అక్కడ కుర్చీలు, టేబుళ్లు. ఏ హంగూ లేకపోయినా ఇతర హోటళ్లకు లేని ప్రత్యేకత కమలమ్మ హోటల్ సొంతం. అదే.. రూపాయి ఇడ్లీ.
కమలమ్మ హోటల్లో ఒక్క రూపాయికే ఒక ఇడ్లీ లేదా దోసె తినొచ్చు. గ్రామంలోని రైతులు, పేదలు.. ఉదయాన్నే ఓ పది రూపాయలు పట్టుకొచ్చి కడుపు నిండా పది ఇడ్లీలు, దోసెలు తిని పొలం పనులకు పయనమవుతారు. అయితే, కరోనా కాలంలో పెరిగిన ధరలు పట్టించుకోకుండా ఇప్పటికీ రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తోంది కమలమ్మ. ఆదాయం కోసం పాకులాడకుండా, అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపుతున్న కమలమ్మకు గ్రామస్థులు సలాం చేస్తున్నారు.
‘‘50 ఏళ్లుగా ఈ బామ్మ ఇక్కడే రూపాయి ఇడ్లీ, దోసె అమ్ముతోంది. నా లాంటి పేదలు కేవలం రూ.10లకే ఆకలి తీర్చుకోవచ్చు. బయట పెద్ద హోటళ్లకు వెళ్తే... ఒక్కో దోసెకు రూ.35-రూ.50 చెల్లిస్తాం. కానీ, ఇక్కడ అలా కాదు’’ అంటున్నాడు ఆ గ్రామస్థుడు. తనకు డబ్బులో లభించని ఆత్మ సంతృప్తి పేదల ఆకలి తీర్చడంలోనే దొరుకుతుందంటోంది కమలమ్మ. అందుకే, రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తానంటోంది. ‘‘మా అమ్మ 50 పైసలకే ఓ దోస/ఇడ్లీ అమ్మి మమ్మల్ని పోషించింది. ఆమె మరణించాక నేను ఈ వ్యాపారం చేపట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నాను. ఒకరి ఆకలి తీర్చితే మనసుకు తృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తి ఏ సంపాదన వల్ల వస్తుంది?’’ అంటోంది ఈ ముసలావిడ. నిజంగా ఈమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!