Konejeti Rosaiah: రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Updated : 05 Dec 2021 10:53 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అమీర్‌పేటలోని ఆయన నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగునాట రాజకీయాల్లో అపర చాణక్యుడిగా ఆయన ఖ్యాతి గడించారని కొనియాడారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని