Dollar Seshadri: పదవులతో నిమిత్తం లేకుండా తితిదేకి సేవలందించారు: వెంకయ్య

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.

Published : 29 Nov 2021 09:40 IST

దిల్లీ: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో పదవులతో నిమిత్తం లేకుండా శేషాద్రి వివిధ హోదాల్లో చాలా కాలం పాటు సేవలందించారన్నారు. తానేప్పుడు తిరుమల వెళ్లినా దర్శన సమయంలో పక్కనే ఉండి ఆలయ విశేషాలను వివరించేవారని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. డాలర్‌ శేషాద్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఉప రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని